
అర్హులందరికీ రేషన్ బియ్యం పంపిణీ
నర్సాపూర్: రేషన్కార్డులు కలిగి ఉన్న లబ్ధిదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని డీఎస్ఓ నిత్యానంద ఆదేశించారు. శనివారం పట్టణంలోని ఎంఎల్ఎస్ పాయింట్ గోదాంతో పాటు పలు రేషన్ దుకాణాలను తనిఖీ చేసి బియ్యం నాణ్యత, రికార్డులను పరిశీలించారు. స్టాక్ అయిపోతే తన దృష్టికి తెస్తే బియ్యం సరఫరా చేస్తామన్నారు. నాణ్యతగా లేకపోతే, మార్పు చేయించి నాణ్యమైన బియ్యం అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆయ న వెంట రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆనంద్కుమార్, పలువురు డీలర్లు, గోదాం సిబ్బంది ఉన్నారు.
అరుణాచలానికి
ప్రత్యేక బస్సు
చిన్నశంకరంపేట(మెదక్): మెదక్ ఆర్టీసీ డిపో నుంచి అరుణాచలం గిరి ప్రదక్షణకు ప్రత్యేక బస్సును నడుపుతున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. శనివారం నార్సింగి మండలం శేరిపల్లిలో వారు మాట్లాడుతూ.. ఈనెల 24న సాయంత్రం 6 గంటలకు మెదక్ డిపో నుంచి బస్సు బయలుదేరి కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, కంచి మీదుగా అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరి ప్రదక్షణ అనంతరం బస్సు తిరిగి మెదక్ బయలుదేరుతుందన్నారు. ఒక్కరికి రూ. 4 వేలు టికెట్ కాగా, హాఫ్ టికెట్ రూ. 2,600 ఉందన్నారు. మెదక్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒకే గ్రామం నుంచి టీంగా వెళ్లాలనుకునే వారి కోసం ప్రత్యేక బస్సును అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఇతర వివరాలకు 7382830420, 9494825746 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.
దరఖాస్తులతో బారులు
శివ్వంపేట(నర్సాపూర్): గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ముగిసినప్పటికీ శనివారం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు ఇచ్చేందుకు రైతులు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు క్యూలైన్ ఏర్పాటు చేశారు. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అర్జీలు స్వీకరించినట్లు తహసీల్దార్ కమలాద్రి, ఉప తహసీల్దార్ షఫీయోద్దీన్, ఆర్ఐ కిషన్ తెలిపారు. శనివారం 188 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు.
రైతు భరోసా
రూ. 201 కోట్లు జమ
మెదక్ కలెక్టరేట్: రైతు భరోసా కింద ఇప్పటివరకు జిల్లాలోని 2,53,020 మంది రైతుల ఖాతాల్లో రూ. 201 కోట్లు నేరుగా జమ అయినట్లు కలెక్టర్ రాహుల్రాజ్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఎకరానికి ఏడాదికి రూ. 12,000 పంట పెట్టుబడి సాయం (రెండు విడతల్లో) ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని తెలిపారు.
గోదాంలో స్టాక్ రిజిస్టర్ను
పరిశీలిస్తున్న డీఎస్ఓ నిత్యానంద

అర్హులందరికీ రేషన్ బియ్యం పంపిణీ