జీఎస్టీ 2.0పై అవగాహన ఉండాలి | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ 2.0పై అవగాహన ఉండాలి

Oct 10 2025 5:52 AM | Updated on Oct 10 2025 5:52 AM

జీఎస్టీ 2.0పై అవగాహన ఉండాలి

జీఎస్టీ 2.0పై అవగాహన ఉండాలి

మంచిర్యాలటౌన్‌: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0ను అమల్లోకి తీసుకొచ్చిందని, దీనిపై వ్యాపారులకు పూర్తి అవగాహన ఉండాలని మంచిర్యాల సెంట్రల్‌ జీఎస్టీ విభాగాధికారి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ట్యాక్స్‌ టీవీ.రమణారెడ్డి అన్నారు. చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని వ్యాపారులకు మంచిర్యాలలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఎస్టీ పన్ను స్లాబుల మార్పును వివరించాలని తెలిపారు. అనంతరం వ్యాపారుల సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో జీఎస్టీ సూపరింటెండెంట్‌ అమన్‌రాజ్‌, ఇన్‌స్పెక్టర్‌ వసంత్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement