
‘హైటెన్షన్ విద్యుత్ లైన్ తొలగించాలి’
నెన్నెల: మండలంలోని కొత్తూర్లో తమ ఇళ్లపై నుంచి వెళ్తున్న 11కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ తొలగించాలని లంబాడివాడ, పొడిషంవాడ కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఐదురోజుల క్రితం వీచిన ఈదురుగాలులకు విద్యుత్ వైర్లు తెగి ఇళ్లపై పడడంతో గ్రామానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరమ్మతు పనులు చేపట్టేందుకు వెళ్లిన సిబ్బందిని శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఏడీఈ రవికుమార్, డీఈ రాజన్న, ఏఈ ఎస్.రాజన్న, ఎస్సై ప్రసాద్, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్ నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు.