
ప్రాణహితలో పడవ కష్టాలు షురూ..
● నదిలో పెరుగుతున్న నీటిమట్టం ● రద్దయిన కాలినడక ప్రయాణం ● సరిహద్దు గ్రామాల ప్రజలకు తప్పని ఇబ్బందులు ● వంతెన నిర్మించాలని వేడుకోలు
వేమనపల్లి: ప్రాణహిత నదిలో కొద్దిపాటి నీటిమ ట్టం పెరగడంతో కాలినడక (సొచ్చిరేవుల) ప్రయా ణం రద్దయి ఇరురాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజ లకు నాటుపడవ కష్టాలు మొదలయ్యాయి. మహా రాష్ట్ర–తెలంగాణ సరిహద్దుగా కుమురంభీం జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి నుంచి బెజ్జూర్, దహెగాం, మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల గుండా ప్రాణహిత నది ప్రవహిస్తోంది. ఎగువన కౌటాల మండలం గూడెం వద్ద, దిగువన కోటపల్లి మండలం అర్జునగుట్ట వద్ద మాత్రమే నదిపై అంతర్రాష్ట్ర వంతెనలు ఉన్నాయి. వేమనపల్లి మండలం కళ్లంపల్లి, వేమనపల్లి పుష్కరఘాట్, రేగుంటఘాట్, వెంచపల్లి, రాచర్ల, ప్రాణహిత ఘా ట్ల గుండా వర్షాకాలంలో పడవ ప్రయాణం కొనసాగుతుంది. మార్చి నుంచి జూన్ వరకు నాలుగు మా సాలపాటు నదిలో వరద తగ్గడంతో సొచ్చిరేవుల గుండా ప్రజలు రాకపోకలు సాగిస్తారు. ఆ సమయ ంలో ఎడ్లబండ్లు బైక్లు, ట్రాక్టర్ల సాయంతో ఇరు రాష్ట్రాలకు రాకపోకలు ఉంటాయి. మిగతా 8 నెలలు ఇరు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తారు. బోట్ రైడ ర్లు వరద తీవ్రతను బట్టి ఒక్కొక్కరికి రూ.50 నుంచి రూ.150 వరకు చార్జీలు వసూలు చేసి నది దాటిస్తారు. సరిహద్దు గ్రామాల ప్రజలు పడవ కష్టాలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలు వంతెన నిర్మించాలని కోరుతున్నారు.