
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి●
● కలెక్టర్ కుమార్దీపక్
మంచిర్యాలఅర్బన్: విద్యార్థులకు విలువలతో కూ డిన నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్కుమార్ దీపక్ సూచించారు. శనివారం జిల్లా పరిషత్ బా లుర, బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించా రు. తరగతి గదులు, వంటశాలలు, ఆర్వో ప్లాంట్, హాజరు పట్టికలు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా తాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు, నా ణ్యత కలిగిన నిత్యావసరాలు వినియోగించాలన్నా రు. విద్యార్థులకు శుద్ధమైన తాగునీటిని అందించా లని ఆదేశించారు. బడిబయట పిల్లలు, మధ్యలో బడి మానేసిన పిల్లలను గుర్తించి పాఠశాలలో చే ర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎంలు వెంకటేశ్వర్లు, పద్మజా పాల్గొన్నారు.