
● ఇన్చార్జి వీసీ గోవర్ధన్
యోగాతో ఆరోగ్య జీవనం●
బాసర: ప్రతి ఒక్కరూ యోగా చేయాలని, దినచర్యలో భాగం చేసుకోవడంతో ఆరోగ్యకర జీవనం కొనసాగించాలని ఇన్చార్జి వీసీ గోవర్ధన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ట్రిపుల్ ఐటీలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. యోగా శిక్షకురాలు శ్రీలక్ష్మి హాజరై యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. విద్యార్థుల్లో పెరుగుతున్న ఒత్తిడి నివారించేందుకు యోగా సాధన చేయాలన్నారు. కార్యక్రమంలో సమన్వయకర్త డాక్టర్ రాకేశ్రెడ్డి, డాక్టర్ విజయ్కుమార్, డాక్టర్ శ్రవణ్రెడ్డి, పీడీ శ్యామ్బాబు, కౌన్సిలర్ నాగలక్ష్మి, టీచింగ్, నాన్ టీచింగ్స్టాఫ్, విద్యార్థులు పాల్గొన్నారు.