
‘పీఎం జన్మన్’తో పీవీటీజీల జీవితాలు మెరుగు
దండేపల్లి: పీవీటీజీల జీవితాలను మెరుగు పరి చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్ మి షన్ను ప్రారంభించిందని డీటీడబ్ల్యూవో జనార్దన్ తెలిపారు. మండలంలోని లింగాపూర్ రైతువేదికలో శనివారం తోటీ కాలనీ గిరిజనులకు పీఎం జన్మన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఈ మిషన్ ద్వారా పీవీటీజీలకు పక్కా గృహాలు, స్వచ్ఛమైన తాగునీరు, రోడ్లు, విద్యుత్ సౌకర్యం, పాఠశాలలు, వసతి గృహా లు, వయోజన విద్య, పోషకాహారం వంటివి అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జీవరత్నం, తదితరులు పాల్గొన్నారు.