
ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఒకరికి రిమాండ్
ఆదిలాబాద్రూరల్: ఇంటి స్థలాల ఫోర్జరీ, చీటింగ్ కేసులో ఒకరికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ హుస్సేన్ తెలి పారు. మావల పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి ఈమేరకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన వకుళభర ణం ఆదినాథ్ ఆయన భార్య రజినిలు 2010లో మా వల స్టేషన్ పరిధిలోని శోభకు ఖానాపూర్ శివారులో ఫారెస్ట్ భూమిని తన పేరిట ఉందని నమ్మించి నా లుగు ప్లాట్లు విక్రయించారు. ఆ ప్లాట్లకు గాను రూ.3.30 లక్షలు తీసుకున్నారు. బాధితురాలికి విక్రయించిన ప్లాట్లను 2022లో ఫారెస్ట్ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ విషయం బాధితురాలికి తెలిసింది. తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇ వ్వాలని ఆదినాథ్, రజినిని కోరగా, కోర్టులో చూసుకోవాలని, మీకు నచ్చిన వారికి చెప్పుకోమని బెది రించారు. ఈనెల19న బాధితురాలు మావల పోలీ సులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆదినా థ్ను అరెస్టు చేయగా, భార్య రజిని పరారీలో ఉన్నా రు. సమావేశంలో మావల సీఐ కర్రె స్వామి, ఎస్సైలు ముజాహిద్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.