
బెస్ట్ అవైలబుల్ స్కూల్కు డ్రా పద్ధతిలో ఎంపిక
మంచిర్యాలఅగ్రికల్చర్: బెస్ట్ అవైలబుల్ స్కూల్కు విద్యార్థులను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికా రి రాజేశ్వరి అన్నారు. శనివారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో లక్కీడ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ఎస్సీ విద్యార్థులను బెస్ట్ అవైలేబుల్ స్కీం ద్వారా 1వ తరగతిలో 91 మందిని, 5వ తరగతిలో 92 మందిని ఎంపిక చేసి ప్రైవేట్ పాఠశాలల్లో వసతితో కూడిన ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో చేరాలని సూచించారు.