
బైక్పై పడిన విద్యుత్ స్తంభం
● దస్నాపూర్ కాలనీలో ఘటన ● తండ్రికి స్వల్పగాయాలు..క్షేమంగా బయటపడిన కుమారుడు
ఆదిలాబాద్రూరల్: విద్యుత్ స్తంభం బైక్పై పడిన ఘటనలో తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. కుమారుడు క్షేమంగా బయటపడ్డాడు. మావల మండలం దస్నాపూర్ కాలనీలో శనివారం ఈ ఘ టన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్ దెబ్బ తింది. విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి కథనం ప్రకారం.. దస్నాపూర్లోని తిరుమల పెట్రోల్ పంపు నుంచి దస్నాపూర్ కాలనీ మీదుగా కై లాస్నగర్ వరకు 33 కేవీ లింక్లైన్ విద్యుత్ పనులు కొనసాగుతున్నాయి. దస్నాపూర్లో కాంట్రాక్టర్ పనులు చేస్తున్నారు. ఆ సమయంలో విద్యుత్ శాఖ టౌన్ త్రీలో అసిస్టెంట్ లైన్మెన్గా పని చేస్తున్న అజ్మత్ తన కుమారుడిని పాఠశాల నుంచి బైక్పై తీసుకువస్తున్నాడు. పెట్రోల్ అయిపోవడంతో బైక్పై కుమారుడిని కూర్చొబెట్టుకుని ఓ గల్లీ గుంచి తోసుకుంటూ వస్తున్నాడు. ఈక్రమంలో కాంట్రాక్టర్, సిబ్బంది చెట్టుకొమ్మను తొలగిస్తున్నారు. స్తంభానికి కట్టి ఉన్న జియో కేబుల్పై చెట్టుకొమ్మ పడింది. దీంతో స్తంభం విరిగిపోయి బైక్పై పడింది. అజ్మత్కు స్వల్ప గాయాలయ్యాయి. కుమారుడికి క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.