భయం పోయింది.. | - | Sakshi
Sakshi News home page

భయం పోయింది..

Apr 20 2026 9:47 AM | Updated on Apr 20 2026 9:47 AM

ముందు ఒక లెక్క చేయడానికి నిమిషాల సమయం పట్టేది. ఇప్పుడు అదే లెక్కను సెకండ్లలో చేస్తాం. గణితం అంటే భయం పోయింది. – గౌతమి, విద్యార్థిని, పెదిరిపాడు

విస్తరణ అవసరం..

ప్రస్తుత ఫలితాలను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని మరిన్ని పాఠశాలలకు విస్తరించి మరింత మంది విద్యార్థులకు అందించాల్సిన అవసరం ఉంది. లెక్కలంటే భయం అనే భావనను తొలగించి ఆసక్తిగా మార్చగల సామర్థ్యం ఈ కార్యక్రమంలో ఉందని స్పష్టం అవుతోంది.

– బాలకిష్టప్ప, ప్రధానోపాధ్యాయుడు

స్పష్టమైన మార్పు..

విద్యార్థులు గణితాన్ని సులభంగా అర్థం చేసు కొని వేగంగా చేయగలిగే స్థాయికి చేరుకోవడం ఈ కార్య క్రమం విజయాన్ని సూచిస్తోంది. తక్కువ సమయంలోనే స్పష్టమైన మార్పు కనిపించడం ప్రత్యేకం.

– విద్యాసాగర్‌,

అకాడమిక్‌ మానిటరింగ్‌ అధికారి

మంచి ఫలితాలొచ్చాయి..

గణితంపై విద్యార్థుల్లో ఉన్న భయాన్ని తగ్గిస్తూ ప్రాథమిక నైపుణ్యాలను బలోపేతం చేసే దిశగా వేదిక్‌ మ్యాథమెటిక్స్‌ కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా గ్రామీణ పాఠశాలల్లో ఆత్మవిశ్వాసం పెరగడం ప్రశంసనీయమైన అంశం.

– డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి

Advertisement
 
Advertisement
Advertisement