మాధవరెడ్డి లిఫ్టు సర్వే పనులకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

మాధవరెడ్డి లిఫ్టు సర్వే పనులకు భూమిపూజ

Nov 11 2025 7:25 AM | Updated on Nov 11 2025 7:25 AM

మాధవరెడ్డి లిఫ్టు సర్వే పనులకు భూమిపూజ

మాధవరెడ్డి లిఫ్టు సర్వే పనులకు భూమిపూజ

సర్వే పనులకు భూమిపూజ చేస్తున్న రాష్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి

వనపర్తి రూరల్‌: మండలంలోని కాశీంనగర్‌ సమీపంలో నిర్మించనున్న డాక్టర్‌ మాధవరెడ్డి లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు సర్వే పనులకు సోమవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గంలో 6 గ్రామాలు, 13 గిరిజన తండాల్లో దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ లిఫ్టు దోహదపడుతుందన్నారు. బీ8 నుంచి రామన్న గట్టు రిజర్వాయర్‌కు నీళ్లు తెచ్చి, అక్కడి నుంచి మూడు లిప్టుల ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందిస్తామని చిన్నారెడ్డి అన్నారు. మొదటి లిప్టు ద్వారా కాశీంనగర్‌లో 1000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, రెండో లిఫ్టు ద్వారా దత్తాయిపల్లి, అంజనగిరిలో 1000 ఎకరాలకు, మూడో లిఫ్టు ద్వారా జయన్న తిర్మలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లిలో 3 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ సర్వే పనులకు ప్రభుత్వం రూ.22 లక్షలు మంజూరు చేసిందని, సర్వే పనులు పూర్తి చేసి డీపీఆర్‌కు సమర్పిస్తారని, ఆ తర్వాత ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే లిఫ్టు ఇరిగేషన్‌ పనులు మొదలవుతాయన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్య, కాంగ్రెస్‌ నాయకులు రాములు, నందిమల్ల రాములు, గట్టు రాజు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement