
వక్ఫ్ భూముల్లో రియల్ దందా!
వక్ఫ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న ఇనాం భూముల్లో ‘రియల్’ గద్దలు వాలాయి. అనుభవదారుల వారసులు తెగబడగా.. సుమారు రూ.7 కోట్ల భూమికి ఎసరుపెట్టారు. ఓ పంచాయతీ స్థాయి అధికారి వారితో కుమ్మకై ్క అందినకాడికి దండుకుంటున్నట్లు సమాచారం. హన్వాడ మండలం గుడిమల్కాపూర్లో చోటుచేసుకున్న దందాపై ‘సాక్షి’ కథనం..
– సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్
పల్లె ప్రకృతి వనంలోని నరికివేసిన చెట్లు
హన్వాడ మండలం గుడిమల్కాపూర్లో వెలుగులోకి..
● సుమారు రూ.7 కోట్ల భూమికి ఎసరు ● 7.07 ఎకరాల్లో ఇనాం భూములు
● తెగబడిన అనుభవదారుల వారసులు ● ఓ పంచాయతీ సెక్రటరీతో కుమ్మక్కు
● బినామీ పేరుతో 300 గజాల స్థలం కొన్న సదరు అధికారి
● అందినకాడికి దండుకుని గృహనిర్మాణాలకు అనుమతులు
● పల్లె ప్రకృతి వనంలో చెట్లను నరికేసిన ఘనులు

వక్ఫ్ భూముల్లో రియల్ దందా!