ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు | - | Sakshi
Sakshi News home page

ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు

May 23 2025 5:31 AM | Updated on May 23 2025 5:31 AM

ఝాన్స

ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు

పాలకుర్తి: ఫెమా నిబంధనలు ఉల్లంఘించి భూములు కొనుగోలు చేసిందనే కారణంతో పాలకుర్తి కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ హనుమాండ్ల ఝాన్సీరెడ్డికి హైకోర్టు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. 2017లో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం గుర్తూరు గ్రామంలో ఝాన్సీరెడ్డి, డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి దంపతులు 75 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీరెడ్డి స్వదేశంలో భూమి ఎలా కొనుగోలు చేస్తుందంటూ వర్ధన్నపేట మండలం ఇల్లందకు చెందిన దామోదర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 1న హైకోర్టులో జడ్జి సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై జూన్‌ 19 లోపు వివరణ ఇవ్వాలని ఝాన్సీరెడ్డి, డాక్టర్‌ రాజేందర్‌రెడ్డి దంపతులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వీరితోపాటు రెవెన్యూ అధికారుల వివరణ కోరింది. గుర్తూరులో కొనుగోలు చేసిన 75 ఎకరాల భూమిలో ఝాన్సీరెడ్డి దంపతులు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ సెంటర్‌ నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసి పనులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చానీయాంశంగా మారింది. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి.. ఝాన్సీరెడ్డికి కోడలు కావడం గమనార్హం.

పుష్కరాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

భూపాలపల్లి రూరల్‌: పుష్కరాలకు వెళ్తున్న మహిళను బొగ్గు టిప్పర్‌(లారీ) ఢీకొట్టడంతో మృతిచెందిన ఘటన భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ సెంటర్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. జిల్లాలోని మహాముత్తారం మండలం మీనాజీపేటకు చెందిన జిల్లాల రాజమ్మ (65) కాళేశ్వరం పుష్కరాలకు వెళ్లేందుకు మీనాజీపేట నుంచి బంధువుల కారులో భూపాలపల్లికి చేరుకొని అంబేడ్కర్‌ సెంటర్‌లో దిగింది. అక్కడనుంచి బస్టాండ్‌ వైపునకు సిగ్నల్‌ క్రాస్‌ చేస్తున్న క్రమంలో తాడిచెర్ల నుంచి జెన్‌కోకు బొగ్గులోడుతో వస్తున్న టిప్పర్‌.. రాజమ్మను ఢీకొని నడుము భాగంపైనుంచి వెళ్లింది. దీంతో అపస్మారకస్థితిలో ఉన్న రాజమ్మను స్థానికులు 108 ద్వారా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే రాజమ్మ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి (వరుసకు) కుమారుడు రాంచంద్రం ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు.

ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు1
1/1

ఝాన్సీరెడ్డికి హైకోర్టు నోటీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement