డబ్బులు కట్టించుకున్నారు.. చెల్లించడం లేదు | - | Sakshi
Sakshi News home page

డబ్బులు కట్టించుకున్నారు.. చెల్లించడం లేదు

Dec 18 2023 1:00 AM | Updated on Dec 18 2023 1:00 AM

స్టేజీపై ఆందోళన చేస్తున్న బాధితులు 
 - Sakshi

స్టేజీపై ఆందోళన చేస్తున్న బాధితులు

మహబూబాబాద్‌ రూరల్‌ : మహర్ష డెవలపర్స్‌ లిమిటెడ్‌ గ్రూప్‌లో పాలసీలు చెల్లించిన వారికి ఎఫ్‌డీల గడువు ముగిసినా డబ్బులు చెల్లించడం లేదంటూ సంస్థ సీఈఓను ఏజెంట్లు, బాధితులు నిలదీసి ఆందోళన చేశారు. ఈ ఘటన మహబూబాబాద్‌ మండలం ఆమనగల్లులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మహర్ష డెవలపర్స్‌ లిమిటెడ్‌ గ్రూపు దశమ వార్షికోత్సవం ఆదివారం ఆమనగల్లులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కంపెనీ సీఈఓ గుడిబోయిన వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పాలసీలు, ఎఫ్‌డీల పేరుతో వసూలు చేసిన డబ్బులను గడువు ముగిసినా చెల్లించడం లేదంటూ సంస్థ నిర్వాహకులతో ఏజెంట్లు, బాధితులు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా బాధితురాలు జయమ్మ, ఏజెంట్‌ స్వరూప మాట్లాడుతూ సంవత్సరం నుంచి వరంగల్‌లోని సంస్థ కార్యాలయం మూసి ఉంటుందని, ఫోన్‌ చేస్తే సమాధానం లేదన్నారు. గడువు ముగిసిన వారికి డబ్బులు ఇవ్వకుండా వెంచర్‌లో ప్లాట్లను బలవంతంగా అంట గడుతున్నారని వాపోయారు. ఈ సందర్భంగా మహర్ష గ్రూప్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ సీఈఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.

మహర్ష డెవలపర్స్‌ ఏజెంట్లు,

బాధితుల ఆందోళన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement