న్యూస్రీల్
పశ్చిమ కృష్ణాలో మండుతున్న ఎండలు.. ఎండుతున్న పంటలు 43.5 శాతం లోటు వర్షపాతం జలకళ కోల్పోయిన ఏర్లు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు నష్టం కరువు మండలాల ప్రకటన కోసం అన్నదాతల ఎదురుచూపు
పూత, కాయ దశలోనే పత్తి పంటకు దెబ్బ
ఆయుర్వేదంపై అవగాహన ర్యాలీ
ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
7
మచిలీపట్నంటౌన్: బందరులో బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్ వద్ద సివిల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో 11 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శనివారం ధర్నా చేశారు.
ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురు భక్తులు శనివారం విరాళాలు అందచేశారు. దుర్గమ్మ దర్శనానంతరం అమ్మవారి ప్రసాదాలు ఇచ్చారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం మహాకవి, పద్మభూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఘనంగా జరిగాయి. కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బోయి భీమన్న జీవిత ఛాయా చిత్ర మాలికను మంత్రి దుర్గేష్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీశతో కలిసి భీమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గుంటూరు జిల్లాకు చెందిన రచయిత, సాహితీవేత్త భూసురపల్లి వెంకటేశ్వర్లుకు ’బోయి భీమన్న అవార్డు–2026’ అందజేశారు. భీమన్న సతీమణి బోయి హైమావతి, రాష్ట్ర నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడిలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలకు చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్(సీఎఫ్వో)గా చంద్రశేఖర్ ఆజాద్ను ప్రభుత్వం నియమించింది. గతంలో దుర్గగుడి ఈవోగా పని చేసిన అనుభవం ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయనే భావనతో నియమించినట్లు తెలుస్తోంది. శనివారం దుర్గగుడికి చేరుకున్న ఆజాద్ ఆలయంలో జరుగుతున్న ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎఫ్వోను దుర్గగుడి చైర్మన్ రాధాకృష్ణ అన్నదాన భవనంలో కలిసి ఏర్పాట్లపై చర్చించారు. ఆయన వెంట ఈవో శీనానాయక్, ఈఈ ఎల్.రమాదేవి, రాంబాబు తదితరులు ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ, గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): పశ్చిమ కృష్ణా (ఎన్టీఆర్ జిల్లా)లో కరువు ఛాయలు అలముకున్నాయి. ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వేసవిని తలపించే ఎండలతో భూములు నెర్రెలిచ్చి నోళ్లు తెరిచాయి. ఏటా వర్షాకాలంలో వరద నీటితో కళకళలాడే కట్టలేరు, వైరా ఏరు, మున్నేరు, పాలేరు, బుడమేరు వాగులు, ఏర్లు ఈసారి జలకళకు నోచుకోలేదు. వర్షాలు కురవకపోతాయా.. పంటలు దక్కకపోతాయా అన్న ఆశతో సాగు చేపట్టిన అన్నదాతలకు నిరాశే మిగిలింది.
సాగు విస్తీర్ణం తగ్గినా
తప్పని నష్టం
ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, తిరువూరు, నందిగామ డివిజన్ల పరిధిలో ఈ ఖరీఫ్ సీజన్లో సాధారణ సాగు విస్తీర్ణం 94,197 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 69,900 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ విస్తీర్ణంలో 74 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఇందులో వరి 35,894, పత్తి 23,013, పెసలు 5,023, మొక్కజొన్న 3,137, మినుము 2,156, కంది 349 హెక్టార్లలో సాగు చేసినట్లు అంచనా వేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో అధికంగా వర్షాధార సాగుపైనే రైతులు ఆధారపడుతున్నారు. ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు ముఖం చాటేయడంతో సాగునీటి వనరులపై తీవ్ర ప్రభావం పడింది. ఏటిపట్టు గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు సక్రమంగా పని చేయక పోవడంతో అనేక ప్రాంతాల్లో వరి నారుమడులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లతో నీటిని అందించే ప్రయత్నం చేసినా, భూగర్భ జలాలు అడుగంటడంతో అవీ ఫలించలేదు.
జిల్లాలో తాగునీటి
వనరులపైనా ఆందోళన
ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు సాధారణంగా 651.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 368.2 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. జిల్లాలో 43.5 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలోని 16 గ్రామీణ, 4 పట్టణ మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. డివిజన్ల వారీగా పరిశీలిస్తే.. గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉన్న తిరువూరు డివిజన్లో 45.3 శాతం, నందిగామ డివిజన్లో 52.6 శాతం, విజయవాడ డివిజన్లో 33.9 శాతం లోటు వర్షపాతం నమోదైంది. దీంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం పడటంతో పాటు తాగునీటి వనరులపైనా ఆందోళన నెలకొంది.
కరువు ప్రకటన ఏదీ?
జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కరువు మండలాల ప్రకటన చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరువు పరిస్థితులను గుర్తించి తక్షణమే సహాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నుంచి స్పష్టమైన భరోసా లేకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ప్రభుత్వం రైతుల పంటల బీమా ప్రీమియం చెల్లించేదని, ప్రస్తుతం ఆ బాధ్యతను రైతులపైనే ఉంచడంతో మరింత ఆర్థిక భారం పడుతోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సాగు పెట్టుబడులకే ఇబ్బందులు పడుతున్న తమకు బీమా ప్రీమియం చెల్లించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు మండలాలను ప్రకటించి పంట నష్టపరిహారం, తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.
అమ్మవారి సేవ పేరుతో టోకరా!
మధురానగర్: జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ర్యాలీ జరిగింది. కలెక్టర్ లక్ష్మీశ, అధికారులు పాల్గొన్నారు.
వర్షాభావ పరిస్థితులు, మండుతున్న ఎండల కారణంగా పత్తి, మొక్క జొన్న పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. పూత, కాయ దశలో ఉన్న పత్తి చేలు నీరందక ఎండిపోతున్నాయి. పూత, కాయ రాలిపోవడంతో దిగుబడిపై ఆశలు సన్నగిల్లాయి. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో తెగుళ్లు సోకడంతో రైతులు మరింత నష్టపోతున్నారు. మొక్కజొన్న పైరుకు సకాలంలో నీరందక నిట్టనిలువునా ఎండి పోయింది. పంటలను కాపాడుకునేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఏటిపట్టు గ్రామాల్లో వరి నారు మడులు సైతం వేయలేకపోవడంతో సాగుభూములు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. వర్షాలు లేక పొలాల్లో నెర్రెలు ఏర్పడ్డాయి. పంటలు దక్కకపోగా పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో రైతు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి పెట్టగా, ప్రస్తుతం ఆ మొత్తం నష్టపోయే పరిస్థితి నెలకొంది.


