కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Aug 3 2025 8:44 AM | Updated on Aug 3 2025 8:52 AM

ఆదివారం శ్రీ 3 శ్రీ ఆగస్టు శ్రీ 2025

ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి స్వాగతం

విమానాశ్రయం(గన్నవరం): కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి గన్నవరం విమానాశ్రయంలో శనివారం ఘనస్వాగతం లభించింది. అమరావతిలో జరగనున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నారు. ఆయనకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, కృష్ణా జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ, ఎస్పీ ఆర్‌.గంగాధరరావు, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రహ్మణ్యం తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కేంద్ర మంత్రి గడ్కరీ రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లారు.

హోంగార్డులకు అభినందన

కోనేరుసెంటర్‌: కృష్ణా జిల్లాలో హోంగార్డులుగా విధులు నిర్వహిస్తూ ఇటీవల విడుదలైన పోలీసు కానిస్టేబుల్స్‌ ఫలితాల్లో విజయం సాధించి సివిల్‌ పోలీస్‌ కానిస్టేబుల్స్‌గా ఉద్యోగ అర్హత సాధించిన సిబ్బందిని శనివారం కృష్ణా ఎస్పీ ఆర్‌.గంగాధరరావు అభినందించారు. జీవితంలో అనుకున్నది సాధించాలనుకున్నప్పుడు ఆత్మ విశ్వాసంతో ముందుకు వెళ్లాలన్నారు. దానికి కృషి, పట్టుదల అవసరమన్నారు. ఒంటిపై యూనిఫామ్‌ పడిన రోజు నుంచి ఎలాంటి రిమార్క్‌ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజా రక్షణే ధ్యేయంగా మరింత బాధ్యతగా ముందుకు సాగాలని సూచిస్తూ వారిని అభినందించారు.

కలంకారీ పరిశ్రమకు రాష్ట్రంలోనే పెడన ప్రత్యేక గుర్తింపు ఉంది. నాడు సార్వత్రిక ఎన్నికల వేళ పెడనలో కలంకారీ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని బహిరంగ సభలో చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత క్లస్టర్‌ ఏర్పాటుపై హడావుడి చేసినా.. ఆ తర్వాత దాని ఊసే మరిచారు. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా క్లస్టర్‌ ఏర్పాటు మాటలేకపోవడంతో కలగానే మిగిలిపోతుందా అనే సంశయం కలంకారీ వ్యాపారులను వెంటాడుతోంది. పాలకుల తీరుతో క్లస్టర్‌ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

పెడన: చంద్రబాబు ఎన్నికల వేళ కలంకారీ వ్యాపారులకు ఇచ్చిన హామీ నీటిమూటలా మారే పరిస్థితి ఎదురవుతోంది. పెడనలో కలంకారీ క్లస్టర్‌ ఏర్పాటు కలగా మిగిలిపోతుందేమోననే సంశయం ఆ వ్యాపారులను కలవరపెడుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఈ ఏడాది జనవరిలో కలంకారీ క్లస్టర్‌ ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులు పెడనలో పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలించారు.

ముందుకు అడుగులు పడని అధికారుల హడావుడి

అధికారులు నానా హడావుడి చేశారు. దీంతో క్లస్టర్‌ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయని అంతా భావించారు. స్థానిక కలంకారీ పరిశ్రమల యాజమానులు, అనుభవజ్ఞులతో క్లస్టర్‌ ఏర్పాటుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో కొందరు ఇతర రాష్ట్రాలకు సొంత ఖర్చులతో వెళ్లి పరిశీలించి వచ్చారు. దీనిపై జిల్లా స్థాయిలో పరిశ్రమల శాఖాధికారులతో సమీక్ష సమావేశాలు సైతం నిర్వహించారు.

నెలలు గడుస్తున్నా ఊసే లేదు

ఆ తర్వాత నెలలు గడుస్తున్నా దాని ఊసే లేదు. కారణం క్లస్టర్‌ ఏర్పాటుకు సుమారు రూ.వందల కోట్లు అవసరం. ప్రైవేటు స్థలం, యంత్రాల కొను గోలుకు రూ.కోట్లు వెచ్చించాల్సి ఉండటంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడిందని, నిధులు లభ్యత అవ్వగానే పనులు చేపడతామనే వాదనను అధికార పార్టీ వారు పేర్కొంటున్నారు. ఈ బ్రేక్‌ శాశ్వతమా లేక కలగానే మారుతుందా అనేది ప్రశ్న. దీనికి కారణాలు గతంలో ‘కలంకారీ’ కోసం నిర్మించిన భవనాల పరిస్థితి ఏమిటనే దిశగా కొందరికి ఆలోచనలు వస్తున్నాయి. ఇది కూడా అలాగే మిగిలిపోతుందా అనేది పట్టణంలో చర్చనీయాంశమైంది. గతంలో నిర్మించిన భవనాల పరిస్థితిని పరిశీలిస్తే అవి నిరుపయోగంగా ఉన్నాయి.

ఎస్సీ కార్పొరేషన్‌ సబ్సిడీతో....

ఆర్మీలో పనిచేస్తూ రిటైర్డ్‌ ఆర్మీ జవాను సువర్ణరాజు పెద్ద మనసుతో తన సొంత స్థలంలో సుమారు 15 ఏళ్ల క్రితం ఎస్సీ కార్పొరేషన్‌ రుణంతో పెడన బైపాస్‌ రోడ్డులో మచిలీపట్నం వైపు కలంకారీ శిక్షణ కేంద్రాన్ని నిర్మించారు. కొన్నాళ్లు శిక్షణ తరగతులు జరిగాయి. ఆ తర్వాత ఏమైందోగానీ దీన్ని పట్టించుకున్న నాథుడే కరవయ్యాడు. తర్వాత సువర్ణరాజు మరణించడం, ఆ భవనం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఆ భవనం గొడవల్లో ఉండటంతో దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.

టూరిజం ఆధ్వర్యంలో భవనం.. ఎస్టీల నివాసం

పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పక్కనే టూరిజం వారు పక్కా భవనాన్ని రూ.లక్షలు వెచ్చించి నిర్మించారు. కలంకారీకి సంబంధించి అన్నీ వివరించడానికి గైడ్‌ను ఏర్పాటుచేసి టూరిస్టులకు తెలియజేసేందుకు చర్యలు తీసుకున్నారు. భవనం నిర్మించారే తప్ప ఆచరణ సాధ్యం కాలేదు. రూ.లక్షలు పెట్టి కట్టిన భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. దీంతో ఎస్టీ కుటుంబాలు నివసిస్తున్నాయి.

చేనేత జౌళిశాఖ నిర్మించిన కలంకారీ ఫెసిలిటీ సెంటర్‌ను అల్లుకున్న పిచ్చి మొక్కలు

పెడనలో శిథిలావస్థకు చేరుకున్న కలంకారీ శిక్షణ కేంద్ర భవనం

7

న్యూస్‌రీల్‌

ఎన్నికల హామీ నీటి మూటేనా! గతంలో కలంకారీ అభివృద్ధికి నిర్మించిన భవనాలు నిరుపయోగం

నిర్మించి

వదిలేశారు

చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని వైఎస్సార్‌ కాలనీలో కలంకారీ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇది కూడా నిరుపయోగంగా ఉంది. మూసి ఉంటే బాగుండదనే ఉద్దేశంతో ఏడాదిలో ఒకసారి తెరుస్తూ అవకాశం ఉన్నప్పుడు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి మమ అనిపిస్తున్నారు.

రూ.లక్షలు పెట్టి భవనాలు నిర్మించి ఖాళీగా వదిలేయడంపై కలంకారి వర్కర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్లస్టర్‌ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.2కోట్లు నిధులు విడుదలయ్యాయని, ఆ సందర్భంగా నాటి ఎంపీ కొనకళ్ల నారాయణరావును కలంకారి వస్త్ర వ్యాపారులు ఘనంగా సత్కరించిన సందర్భాలను సైతం గుర్తు చేస్తున్నారు. ఆ నిధులు ఏమయ్యాయో కూడా తెలియని పరిస్థితులున్నాయి. ప్రభుత్వం వద్ద నిధులు లేని కారణంగా పెడనలో కలంకారీ క్లస్టర్‌ ఏర్పాటు ప్రశ్నార్థకంగా మారింది.

కృష్ణాజిల్లా1
1/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా2
2/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా3
3/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా4
4/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా5
5/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా6
6/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా7
7/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా8
8/9

కృష్ణాజిల్లా

కృష్ణాజిల్లా9
9/9

కృష్ణాజిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement