
మందుల మాయాజాలం
కృష్ణాజిల్లా
శనివారం శ్రీ 2 శ్రీ ఆగస్టు శ్రీ 2025
u8లో
దుర్గమ్మ నమోస్తుతే
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను శ్రావణ శుక్రవారం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి.
తగ్గుముఖం పట్టిన వరద
గాంధీనగర్: ప్రకాశం బ్యారేజీకి వరద తగ్గుముఖం పట్టింది. 89,625 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలివేస్తున్నారు. కాలువలకు 17, 576 క్యూసెక్కులు విడుదల చేశారు.
జిల్లా మహాసభలు
సీపీఐ ద్వితీయ జిల్లా మహాసభలు జగ్గయ్య పేటలో శుక్రవారం నిర్వహించారు. ఈసందర్భంగా నిర్వహించిన ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో పాల్గొన్నారు.
కంకిపాడు: ఖరీఫ్ సాగు రైతులకు ఎరువు కరువైంది. సొసైటీల్లో ఎరువుల నిల్వలు నిండుకున్నాయి. బయటి మార్కెట్లో వ్యాపారులు సృష్టించిన కృత్రిమ కొరత కారణంగా అన్నదాతలు దోపిడీకి గురవుతున్నారు. అదునుకు వేయాల్సిన ఎరువు దొరక్క పైరు ఎదుగుదల లోపిస్తుండటంతో రైతులు దిగాలు చెందుతున్నారు. కోటి ఆశలతో చేపట్టిన ఖరీఫ్ సాగు కష్టాలతో సాగుతున్నా, వ్యవసాయశాఖ కాకిలెక్కలతో సరిపెడుతుందే తప్ప ఎరువులను సమృద్ధిగా అందించడం లేదు. అండగా నిలవాల్సిన కూటమి సర్కారు రైతులను అడుగడుగునా నిర్లక్ష్యం చేస్తోంది. సీజన్కు అవసరమైన ఎరువులను అందించడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందగా. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. ఖరీఫ్లో ఎరువుల కొరతను తీర్చాలంటూ రైతు పక్షాన ఆందోళనలు నిర్వహిస్తోంది.
ఎరువుల కొరత..
ప్రస్తుతం ఎకరాకు ఒక కట్ట యూరియా, ఒక కట్ట డీఏపీ తప్పనిసరిగా వేయాల్సి ఉంది. పైరు ఎదుగుదలకు దోహదపడే యూరియా ప్రస్తుతం దొరకడం లేదు. 80శాతం సొసైటీల్లో ఎరువులు లేకపోవడంతో వ్యాపారులు ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా ఎమ్మార్పీ ధర రూ 265.50 ఉండగా, కొందరు వ్యాపారులు రూ 310 నుంచి రూ.330 వరకూ విక్రయిస్తున్నారు. డీఏపీ ఇతర ఎరువులతోపాటు జింకు, గుళికలను అంటగడుతున్నారు. అవి కొంటేనే డీఏపీ ఇస్తామంటూ రైతులను అందినకాడికి దోచేస్తున్నారు. యూరియా కొరత కారణంగా డీఏపీ రూ.1350 చొప్పున కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు.
పట్టించుకోని అధికారులు...
జిల్లావ్యాప్తంగా ఎరువుల కొరతతో రైతులు అల్లాడుతుంటే వ్యవసాయశాఖ అధికారులు మాత్రం తాపీగా ఎరువుల లభ్యతపై కాకిలెక్కలు చెబుతున్నారు. రైతులకు సరిపడా యూరియాను అందించడంలో విఫలమయ్యారు. మొక్కుబడిగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. ఇటీవల ఉయ్యూరులో విజిలెన్స్ తనిఖీలు చేపట్టగానే, వ్యాపారులు దుకాణాలు మూసివేశారంటే బయటి మార్కెట్లో ఎరువుల గోల్మాల్ ఏస్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోఆపరేటివ్ సొసైటీల్లో 78 టన్నులు, హబ్లలో 0.24 టన్నులు, ఔట్లెట్లలో 534 టన్నులు, పీఏసీఎస్లలో 3807 టన్నులు, రిటైలర్స్ వద్ద 3191 టన్నులు, ఇతరుల వద్ద కలిపి జిల్లాలో మొత్తం 7,696 టన్నుల ఎరువుల లభ్యత ఉన్నట్లు అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
నిర్లక్ష్యం వీడని పాలకులు..
కూటమి సర్కారు రైతు విషయంలో అడుగడుగునా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. సాగునీరు విడుదల, విత్తనాల సరఫరాలోనూ వైఫల్యం చెందింది. తాజాగా ఎరువుల లభ్యతలోనూ అలసత్వం కనబరుస్తుండటం రైతుల పాలిటశాపంగా మారింది. పరిస్థితి ఇదేవిధంగా ఉంటే ఖరీఫ్ సాగు కష్ట మేననే రైతులు అభిప్రాయపడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వహయాంలో రైతుభరోసా కేంద్రాలు, సొసైటీల ద్వారా సకాలంలో ఎరువులు అందించడంతోపాటు పెట్టుబడిసాయాన్ని సైతం అందించిన వైనాన్ని రైతులు గుర్తుచేసుకుంటున్నారు.
పామర్రులో రైతులపక్షాన ర్యాలీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్,
రైతులు, వైఎస్సార్ సీపీ నాయకులు (ఫైల్)
ఖరీఫ్లో సాగవుతున్న వరి పంట
7
న్యూస్రీల్
కూటమి ప్రభుత్వ పతనం తప్పుదు : కై లే
పెదపారుపూడి: ఖరీఫ్ సీజన్లో ఎరువుల కృతిమ కొరత సృష్టిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వానికి పోయేరోజులు దగ్గరలోనే ఉన్నాయని పామర్రు మాజీఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎరువుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ఆయన పెదపారుపూడి వైఎస్సార్ సీపీ మండల నాయకులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శ్రీను నాయక్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కై లే అనిల్కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతులకు అన్నిరకాల ఎరువుల అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాకా ఎరువుల కృతిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతులు యూరియా క్లాంపెక్స్ అడుగుతుంటే షాపుల యజమానులు గుళికలు, జింక్నకు లింకు పెట్టి అమ్ముతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవటం లేదని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులకు ఎరువులు అందుబాటులో వచ్చేవరకు వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తుందని వివరించారు.
అంతా మంత్రి ‘కొల్లు’ డైరెక్షన్లోనే
వైఎస్సార్ సీపీ పోరుబాట..
80వేల హెక్టార్లలో ఇప్పటికే నాట్లు..
కృష్ణాజిల్లా వ్యాప్తంగా 1.62లక్షల హెక్టార్లలో ఖరీఫ్ వరిసాగుకు అనువైన భూమి ఉంది. తొలకరి ముందస్తు పలకరింపుతో బోర్లు కింద ముందుగానే సాగు చేపట్టారు. సాగునీరు విడుదల కావడంతో జిల్లాలో సాధారణంగా వరినాట్లు వేయటం, వెద, వరుస నాట్లు పద్ధతిలో సుమారుగా 80వేల హెక్టార్లలో వరి సాగు పూర్తయ్యింది. ప్రస్తుతం వరిపైర్లు దుబ్బు చేసే దశకు చేరుతున్నాయి. శివారు గ్రామాల్లో వరినాట్లు వేస్తున్నారు.
సొసైటీల్లో నిండుకున్న ఎరువుల నిల్వలు
మార్కెట్లో అన్నదాతల జేబులకు చిల్లు
ఎరువుల లభ్యతపై
వ్యవసాయశాఖ కాకి లెక్కలు
నిర్లక్ష్యంగా కూటమి సర్కారు
రైతుపక్షాన పోరుబాటలో వైఎస్సార్సీపీ
ఎరువుల కొరతతో అల్లాడుతున్న రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేపట్టింది. ఎరువులు సమృద్ధిగా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ నేతృత్వంలో నియోజకవర్గవ్యాప్తంగా రైతుల పక్షాన ఆందోళనలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయ అధికారులకు వినతులు అందించి సమస్యను వివరిస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ సమాయత్తం అవుతోంది.

మందుల మాయాజాలం

మందుల మాయాజాలం

మందుల మాయాజాలం

మందుల మాయాజాలం

మందుల మాయాజాలం

మందుల మాయాజాలం

మందుల మాయాజాలం

మందుల మాయాజాలం