ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

Aug 2 2025 7:12 AM | Updated on Aug 2 2025 7:12 AM

ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని  అందిపుచ్చుకోవాలి

ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి

లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యులంతా ఆధునిక వైద్యవిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ సూచించారు. ఇండియన్‌ నెఫ్రాలజీ సొసైటీ సదరన్‌ చాప్టర్‌ 44వ వార్షిక సదస్సు విజయవాడలోని ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌లో శుక్రవారం ప్రారంభమైంది. వీసీ మాట్లాడుతూ ఆధునిక వైద్యచికిత్సా విధానాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఔషధాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఈ సదస్సు వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ డి.శ్రీహరిరావు, సదస్సు ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.అమ్మన్న, 600మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement