
సాగుకు తూటు గండం
కృష్ణాజిల్లా
ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్ శ్రీ 2025
u8లో
కృష్ణా డెల్టా కింద ఆయకట్టు ఇలా...
రేషన్ షాపుల్లో నో స్టాక్
చదువుల గుడులపై పచ్చ దందా
దొంగలున్నారు జాగ్రత్త!
ఏఈపీఎస్ తరహా సైబర్ నేరాలు విజయవాడలో పునరావృతం అయ్యాయి. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి నేరగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవు
రామవరప్పాడు/గుణదల: మహిళలకు రక్షణ కల్పనలో ప్రభుత్వం విఫలమైందని మహిళా సంఘాలు ధ్వజమెత్తాయి. విజయవాడలో శనివారం కూటమి పాలనపై చర్చా వేదిక జరిగింది.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాలో ఖరీఫ్ సాగుకు తూటుకాడ పెను సమస్యగా మారింది. పంట కాలువలు, ఇరిగేషన్ డ్రెయిన్లను తూటుకాడ, గుర్రపుడెక్క ఆక్రమించి సాగునీటి ప్రవాహానికి ఆటంకంగా నిలిచాయి. కాలువలు, డ్రెయిన్లలో పూడిక తీయకపోవడం, తూటు, గుర్రపు డెక్క దట్టంగా అల్లుకుపోవడంతో ఆయకట్టు చివరి భూములకు సాగునీరు చేరడం కష్టమేనని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కాలువలకు మరమ్మతులు చేపట్టకుండానే సాగునీటి విడుదలకు అధికారులు సిద్ధమయ్యారు. ‘సాగునీటి విడుదలపై సందిగ్ధం’ శీర్షికన ఈ నెల పదో తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన అధికారులు ఈ నెల 15వ తేదీ (ఆదివారం) వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో ఈ ఏడాది ఖరీఫ్ సాగులో రైతులకు కష్టాలు తప్పేలా లేవు.
కాలువల నిర్వహణ పనుల్లో జాప్యం
కృష్ణా డెల్టా పరిధిలో 13.08 లక్షల ఎకరాల ఆయ కట్టు ఉంది. కృష్ణా తూర్పు డెల్టా పరిధిలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించి 5.62 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువల నిర్వహణ పనులకు నిధుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోకుండా జాప్యం చేసింది. మే నెలలో పనుల మంజూరు చేసింది. రూ.10 లక్షల పనులను నామినేషన్పైన నీటి సంఘాలకు కట్టబెట్టే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికీ కొన్ని చోట్ల డిస్ట్రి బ్యూటరీ కమిటీ చైర్మన్లు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్ల మధ్య ఒప్పందం కుదరక పనులు ప్రారంభం కాలేదు. కాలువలకు నీరు విడుదల చేసినా ఆయకట్టు చివరి భూములకు చేరటం కష్టమని నీటి పారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 24 టీఎంసీలకు పైగా జలాలు ఉన్నా సాగునీటి విడుదలలో జరిగిన జాప్యంపై రైతులు, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
అధ్వానంగా కాలువలు, డ్రెయిన్లు
గన్నవరం నియోజకవర్గం పరిధిలోని రామవరప్పాడు, పెరికీడు మధ్య 47 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే కాలువ అధ్వానంగా ఉంది. బుడమేరు గండ్లకు మరమ్మతులు పూర్తి కాలేదు. పెడన నియోజకవర్గంలో చెన్నూరు డ్రెయిన్లో పూడిక తీయలేదు, మరమ్మతులు జరగలేదు. పనులు చేయకుండా నీటి విడుదలపై టీడీపీ ప్రజా ప్రతినిధులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బందరు ప్రధాన కాలువ తూటికాడ, గుర్రపు డెక్కతో పూర్తిగా నిండిపోయింది. గుడివాడ, పెనమలూరు, పామర్రు, అవనిగడ్డ, పెడన నియోజకవర్గాల పరిధిలో కొద్ది పాటి వర్షాలకే డ్రెయిన్లు ఉప్పొంగి పంట పొలాలను ముంచెత్తుతున్నాయి. గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో డ్రెయిన్ల పూడిక తీయకపోవడంతో అధ్వానంగా మారాయి. బుడమేరు, చంద్రయ్య, నెహ్రాలి, మోటూరు ఎల్ఎస్ మేజర డ్రెయిన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. లజ్జ బండ, శివగంగ, తాళ్లపాళెం, ఏనుగులకోడు, వన్నేరు, ముస్తాఫాకోడు, యూటీ, పెద్దలంక, గుండేరు, రత్నకోడు డ్రెయిన్లలో గుర్రపుడెక్క, నాచు, తూటు దట్టంగా అల్లుకున్నాయి.
కాలువ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఆయకట్టు ఆయకట్టు
(ఎకరాల్లో) (ఎకరాల్లో)
బందరు 1.51 లక్షలు –
కేఈబీ 1.38 లక్షలు –
ఏలూరు 0.56 లక్షలు 1,332
రైవస్ 2.17 లక్షలు 425
మొత్తం 5.62 లక్షలు 1,757
I
న్యూస్రీల్
25 నుంచి వెబ్ ఆప్షన్లు
ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని కన్వీనర్ విజయసారథి తెలిపారు. 25వ తేదీన ఎన్సీసీ, విభిన్న ప్రతిభావంతులు, 26, 27 తేదీల్లో స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్సీసీ, 28వ తేదీన క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఆంగ్లో ఇండియన్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తామని వివరించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని సూచించారు. జూలై ఒకటో తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. జూలై మూడో తేదీన సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేస్తామని విజయసారథి ప్రకటించారు.
20 నుంచి
పాలిసెట్ కౌన్సెలింగ్
21వ తేదీ నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
25 నుంచి స్పెషల్ కేటగిరీ కౌన్సెలింగ్
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ –2025 జిల్లా కన్వీనర్ ఎం.విజయసారథి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పాలిసెట్లో ర్యాంకులు పొందిన విద్యార్థులు 20వ తేదీ నుంచి ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించా లని సూచించారు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించిన వారి సర్టిఫికెట్లను ఈ నెల 21వ తేదీ నుంచి పరిశీలిస్తామని తెలిపారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఆంధ్రా లయోల డిగ్రీ కళాశాల, మాచవరంలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. 21 నుంచి 28వ తేదీ వరకు రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్న ఒంటి గంట వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని తెలిపారు.
పూడిక తీయకపోతే కష్టం
తూటు, గుర్రపు డెక్కతో నిండిన కాలువలు
పంట కాలువలు, డ్రెయిన్ల నిర్వహణ, మరమ్మతులను ప్రభుత్వం గాలికి వదిలేసింది. ప్రధానంగా బందరు, రైవస్, కేఈబీ, ఏలూరు కాలువలు తూటికాడ, గుర్రపు డెక్కతో నిండిపోయాయి. పిచ్చిమొక్కల తొలగింపుతోపాటు అక్కడక్కడా కాంక్రీట్ పనులు, షట్టర్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. కాలువలు, డ్రెయిన్ల మరమ్మతులు, మెయింటినెన్స్ కోసం రూ.26.03 కోట్ల విలువైన 650 పనులను మంజూరు చేశారు. ఈ పనులు చాలాచోట్ల మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో కాలువలకు సాగు నీరు విడుదల చేస్తే నిర్వహణ పనులు జరిగే అవకాశం ఉండదు. పనులు చేయకుండానే నిధులను స్వాహా చేసే అవకాశం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు తూటు, గుర్రపుడెక్క కారణంగా సాగునీరు దిగువకు ప్రవహించేందుకు ఆటంకాలు తప్పవు. ఆయకట్టుకు చివరి భూములకు నీరు అందక రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురిస్తే డ్రెయిన్లు పొంగి పొలాలు నీటమునిగే ప్రమాదం ఉంది. దీంతో ఈ ఏడాది తమకు కష్టాలు, కడగండ్లు తప్పేలాలేవని రైతులు వాపోతున్నారు.
కాలువలు అధ్వానం
కాలువలు అధ్వానంగా ఉన్నాయి. నేడో, రేపో నీరు వదులుతామని అంటున్నారు. కాలువల్లో ఎక్కడ చూసినా తూటు, గుర్రపుడెక్కే కనిపిస్తున్నాయి. కాలువల్లో పూడికతీత తీయాల్సి ఉంది. అప్పుడే శివారు భూములకు సాగు నీరు అందుతుంది. ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులపై నిర్లక్ష్యంగా ఉంటున్నారు. గుర్రపు డెక్క, తూటుకాడపై ఇప్పుడు హడావిడిగా మందులు పిచికారీ చేయటం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు.
– వి.మరియదాసు,
కౌలురైతు, గొడవర్రు
నేడు కృష్ణా డెల్టాకు సాగునీటి విడుదల
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో
5.62 లక్షల ఎకరాల ఆయకట్టు
తూటుకాడ, గుర్రపుడెక్క, పూడికతో కాలువలు, డ్రెయిన్లు అస్తవ్యస్తం
ఆయకట్టు చివరి భూములకు
సాగు నీరుచేరడం కష్టమే..
చిన్న వర్షానికే డ్రెయిన్లు పొంగి
నీట మునుగుతున్న పంట పొలాలు
నిధులు మంజూరైనా ముందుకు
సాగని కాలువల మరమ్మతులు
కేఈబీ కెనాల్ మొత్తం మట్టిమేటతో పూడిపోయింది. మట్టిమేటను తొలగించకుండా సాగు నీరు వదిలినా రైతులకు ప్రయోజనం ఉండదు. గత సంవత్సరం నాగాయలంక, కోడూరు పంట కాలువలకు సరిగా సాగునీందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాగునీటి విడుదలలో వంతుల వారీ విధానంతో ఫలితం లేదు. ఈ సంవత్సరం అంతకంటే దారుణంగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సాగుచేయాలంటే భయంగా ఉంది.
– బీసాబత్తిన ప్రసాద్,
డీసీ మాజీ చైర్మన్, నాగాయలంక

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం

సాగుకు తూటు గండం