
ప్లాస్టిక్ వైరు బుట్టలకు కేరాఫ్ మంటాడ
మండలంలోని మంటాడ గ్రామం ప్లాస్టిక్ వైరు బుట్టల తయారీకి ప్రసిద్ధి చెందింది. గత పాతికేళ్లుగా గ్రామంలోని 250 కుటుంబాల వారు ఈ బుట్టల తయారీనే జీవనాధారంగా చేసుకున్నారు. ఐదుగురు కలిసి బుట్టలను అల్లడం, అడుగులు వేయడం, బెల్టులు పెట్టడం చేస్తుంటారు. ఈ బుట్టల్లో చాలా రకాలున్నాయి. మటన్ బుట్ట రూ.600, కోడి బుట్ట రూ.250, కోడి బెల్టు బుట్ట రూ.300, కూరగాయల బుట్ట రూ.150, క్యారేజి బుట్ట రూ.140కు విక్రయిస్తున్నారు. నాటుకోడి కోళ్లఫారాలు, వేటమాంసం దుకాణాలు, కోళ్ల దుకాణాలు, పచారీ సరుకులకు ఎక్కువగా ఈ బుట్టలను కొనుగోలు చేస్తారు.
– పమిడిముక్కల

ప్లాస్టిక్ వైరు బుట్టలకు కేరాఫ్ మంటాడ