ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి..
కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. అప్పుడు నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ప్రచారం చేసి ఇప్పుడు రూ.13 వేలు మాత్రమే వేస్తున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలో అర్హులైన వేలాది మందిని అనర్హులుగా ప్రకటించారు. గతంలో అమ్మ ఒడి తీసుకున్న కుటుంబాలన్నిటికీ ఇప్పుడు తల్లికి వందనం ఇవ్వాలి.
– వానపల్లి రవీంద్ర, వైఎస్సార్ సీపీ విద్యార్థి సంఘ నేత
●
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని తల్లులకు ఎగనామం పెట్టింది. తల్లికి వందనం పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో వేలాది మంది తల్లులను పలు కారణాల పేరుతో అనర్హులుగా ప్రకటించి ఎగ్గొడుతోందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన అమ్మ ఒడి పథకానికి సంబంధించి తాము అధికారంలోకి వస్తే ప్రతి పిల్లవాడికి అమలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ హడావుడి చేసింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత నేడు కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే వేలాది మంది తల్లులకు వెన్నుపోటు పొడిచింది.
అడుగడుగునా మోసం..
కూటమి ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించి అడుగడుగునా మోసం చేస్తోంది. తాజాగా తల్లికి వందనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 లక్షల మందికి మొండి చెయ్యి చూపుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. కేవలం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోనే 50 వేల మంది వరకూ గతంలో తీసుకున్న తల్లులకు అనర్హులుగా ప్రకటించారు. లేనిపోని ఆంక్షలతో తల్లులందరినీ అనర్హులుగా ప్రకటించటం సరికాదు.
– సీహెచ్ వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి, ఎస్ఎఫ్ఐ, ఎన్టీఆర్ జిల్లా
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పలు కారణాలు చూపుతూ వేలాది మందికి ఈ పథకాన్ని ఎగవేసేందుకు పాలకులు కుట్ర చేశారని విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు. గ్రామాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12 వేలకు మించి ఆదాయం ఉంటే వారికి ఈ పథకం వర్తించదని నిబంధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు పైగా ఉంటే వారికి సైతం ఈ పథకం వర్తించదు. అలాగే గత ఏడాది పది, ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన వారికి ఈ పథకంలో చూపటం లేదని ఆయా లబ్ధిదారులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు సైతం ఈ పథకంలో పేర్లు కనిపించటం లేదని పలువురు వాపోతున్నారు. అదే విధంగా ఐటీ రిటర్న్ పేరుతో చాలా మందిని దీనిలో అనర్హులుగా ప్రకటిస్తూ జాబితాలను ప్రదర్శిస్తున్నారు. అయితే తాము ఐటీ చెల్లించటం లేదని వారంతా వివరిస్తున్నారు.
రెండు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..
రెండు జిల్లాల్లో కలిపి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2023లో 3,00,120మంది తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున నగదును వేశారు. ఆ క్రమంలో కృష్ణా జిల్లాలో 1,29,533 మంది తల్లులకు, ఎన్టీఆర్ జిల్లాలో 1,70,587 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ అయ్యింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం ప్రకటించిన నివేదికల ప్రకారం రెండు జిల్లాల్లో 2,53,457 మంది తల్లుల ఖాతాల్లో మాత్రమే నగదు జమ అయ్యేటట్లుగా నిధులను విడుదల చేశారు. ఆ క్రమంలో కృష్ణా జిల్లాలో 1,11,458 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 1,41,999 మంది తల్లుల ఖాతాల్లోకి నగదు జమ కానుంది. అంటే రెండు జిల్లాల వ్యాప్తంగా 46,663 మంది తల్లులకు ఈ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆ క్రమంలో కృష్ణాజిల్లాలో 18,075 మందికి, ఎన్టీఆర్ జిల్లాలో 28,588 మందికి మొండి చెయ్యి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
రూ.2వేలు కోత..
గత ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేల నగదును జమ చేసినప్పుడు కూటమి నేతలు చాలా దారుణంగా మాట్లాడారు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఆ రెండువేలను పాఠశాలల మరుగుదొడ్లు ఇతర నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించి నిధులను విడుదల చేసింది. వాటిని సక్రమంగా వినియోగిచింది. ఎన్నికల సమయంలో ‘నీకు 15 వేలు, నీకు15 వేలు’ అంటూ కూటమి నేతలు తెగ హడావుడి చేశారు. కానీ అధికారంలోకి వచ్చి, ఏడాది ముగిసిన తరువాత అదే రూ.13 వేలు వేసి మిగిలిన రెండు వేలను పాఠశాలల అభివృద్ధి పేరుతో పక్కదారి పట్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఆ రెండు వేలను ఏ ఖాతాలో వేస్తున్నారో స్పష్టత లేదని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లా 2023లో 2025లో తగ్గిన సంఖ్య
తల్లుల సంఖ్య తల్లుల సంఖ్య
కృష్ణాజిల్లా 1,29,533 1,11,458 18,075
ఎన్టీఆర్ జిల్లా 1,70,587 1,41,999 28,588
మొత్తం 3,00,120 2,53,457 46,663
‘తల్లికి వందనం’లో ఆంక్షల పేరుతో వేలాది మంది అనర్హులుగా ప్రకటన గత ప్రభుత్వంలో 3,00,120 మంది తల్లులకు పథకాన్ని వర్తింపజేసిన వైనం ఇప్పుడు 2,53,457 మందికి మాత్రమే పరిమితం చేసిన కూటమి సర్కార్ లోకేష్, చంద్రబాబు ప్రకటనలపై మండిపడుతున్న విద్యార్థుల తల్లులు గతంలో తీసుకున్న తమకూ పథకాన్ని వర్తింపజేయాలంటున్న తల్లులు సచివాలయాల వద్ద అర్హుల జాబితాలు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 46,663 మంది తల్లులకు ఎగనామం
అర్హుల జాబితా
చూసి షాక్..
వరుసగా రెండో ఏడాది ..
నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు డిగ్రీ, రెండో బాబు ఇంటర్మీడియెట్. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి ఏటేటా అందింది. గతేడాది నుంచే తల్లికి వందనం ఇస్తామన్నారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇంటర్మీడియెట్కు వెళ్లాడు. వివరాలు అప్లోడ్ చేయాలంటున్నారు. రెండు సంవత్సరాల పాటు తల్లికి వందనం పోయినట్టే. మళ్లీ ఎప్పుడు పిల్లల చదువులకు సొమ్ము అందుతుందో అర్థం కాని పరిస్థితి.
– తోకల ఉమాదేవి, కోలవెన్ను
వార్డు సచివాలయాల వద్ద అర్హుల జాబితాలను అధికారులు ప్రకటించారు. అయితే గతంలో అమ్మ ఒడి పథకం తీసుకున్న వారి పేర్లు ప్రస్తుత జాబితాల్లో అనర్హులుగా కనపడుతుండటంతో వారంతా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకూ తాము తీసుకున్న ఈ పథకం ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదంటూ మండి పడుతున్నారు. సచివాలయాల సిబ్బంది మీ పేరు మీద కారు ఉందని, ఐటీ రిటర్న్స్ ఉన్నాయని, స్థలం నమోదైందని పలు అంశాలను వివరిస్తున్నారు. అయితే తమకు వారు చెబుతున్నవి ఏమీ లేవంటూ వాపోతున్నారు.
తల్లులకు ఆంక్షల పోటు
తల్లులకు ఆంక్షల పోటు
తల్లులకు ఆంక్షల పోటు
తల్లులకు ఆంక్షల పోటు
తల్లులకు ఆంక్షల పోటు