ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి

Aug 24 2025 8:25 AM | Updated on Aug 24 2025 8:25 AM

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకోవాలి

కాగజ్‌నగర్‌టౌన్‌: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు అందరూ కలిసి కట్టుగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజన్‌ అన్నారు. శనివారం సిర్పూర్‌ (టి) మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవా ల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మండపాల నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. నిబంధన ల మేరకు అన్ని అనుమతులు తీసుకోవాలన్నారు. అనంతరం ఉత్సవాల్లో నిర్వహించే కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌, ఎస్సై కమలాకర్‌, వినాయక మండపాల నిర్వాహకులు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement