
‘పీఎం జుగా’తో మౌలిక వసతులు
కెరమెరి(ఆసిఫాబాద్): ‘పీఎం జుగా’ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనున్న ట్లు గిరిజన సంక్షేమశాఖ డీడీ పీ రమాదేవి తెలిపా రు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. శనివారం మండలంలోని కొఠారి గ్రా మంలో ‘పీఎం జుగా’ అమలు తీరుపై ఆదివాసీలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ పథకం ద్వారా రోడ్డు రవాణా, పాఠశాల, అంగన్వాడీ, కమ్యూనిటీ భవనాలు, పక్కా గృహాలు తదితర మౌలిక సదుపాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయని చెప్పారు. అత్యంత వెనుకబడిన గిరిజనులు అభివృద్ధి చెందాలనే ఆ కాంక్షతోనే ప్రభుత్వాలు ఈ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. దగ్గరలోనే క్యాంపులు ప్రారంభించి ఆధార్, పీఎం కిసాన్ కార్డులు, జన్ధన్ ఖాతాలు తదితర సేవలు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఎండీ అమ్జద్పాషా, కార్యదర్శి సతీశ్కుమార్ తదితరులున్నారు.
పథకంతో గ్రామాలాభివృద్ధి
వాంకిడి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం జుగా పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని సోనాపూర్ రైతు వేదికలో అంతర్జాతీయ యోగా దినోత్సవం, పీఎం జుగా పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏటీడబ్ల్యూవో చిరంజీవి, అధికారులు పాల్గొన్నారు.
లింగాపూర్ మండల కేంద్రంలో..
లింగాపూర్: ఏజెన్సీ ప్రాంతాల గిరిజన గ్రామాల అ భివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం జుగా కార్యక్రమంపై శనివారం మండల కేంద్రంలోని పంచాయతీ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఎంపీడీవో రామచందర్, ఎంపీవో రజనీకాంత్ మా ట్లాడుతూ ఈ పథకం ద్వారా గిరిజనులకు దాదాపు 90శాతం సబ్సిడీతో జీవనోపాధికి యూనిట్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్ మేనేజర్ ముఖేశ్కుమార్, వైద్యులు పాల్గొన్నారు.

‘పీఎం జుగా’తో మౌలిక వసతులు

‘పీఎం జుగా’తో మౌలిక వసతులు