
వృద్ధుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
ఖమ్మంఅర్బన్: వృద్ధుల మానసిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించా ల ని, తద్వారా వారిని కాపాడుకోవచ్చని మాజీ మంత్రి, మమత విద్యాసంస్థల చైర్మన్ పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో ‘వృద్ధుల మానసిక ఆరోగ్యం’ అంశంపై ఏర్పాటుచేసిన రాష్ట్ర మానసిక వైద్యుల సదస్సును శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలో వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారిలో ఒంటరితనం, మతిమరుపు సమస్యలపై చర్చించాల్సిన అవసరముందని తెలిపారు. పరిశోధకులు, వైద్యులు, వైద్యవిద్యార్థులు ఈ అంశంపై దృష్టి సారించాలన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణశాఖ అధ్యక్షుడు డాక్టర్ అశోక్, మమతా విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ నరేన్రాజ్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ దక్షిణ మండల శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఉమాశంకర్తో పాటు డాక్టర్ ప్రసాద్రావు, డాక్టర్ జార్జ్రెడ్డి, డాక్టర్ సతీష్బాబు, డాక్టర్ నారా యణరావు, డాక్టర్ ఆకుల విశాల్, డాక్టర్ రాయిరాల అనిత తదితరులు పాల్గొన్నారు.
జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలి
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా నుంచి జాతీయ, అంతర్జాతీ య స్థాయికి ఎదిగిన క్రీడాకారులను వర్ధమాన క్రీడాకారులు స్ఫూర్తిగా తీసుకుని సత్తా చాటాలని ఖమ్మం మేయర్ పి.నీరజ సూచించారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీలను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో శారీ రక దృఢత్వంతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. బాడ్మింటన్ అసో సియేషన్ జిల్లా అధ్యక్షుడు కర్నాటి వీరభద్రం మాట్లాడగా కార్పొరేటర్ కమర్తపు మురళి, అసోసియేషన్ బాధ్యులు దుద్ధుకూరి సత్యనారాయణ, వి. చంద్రశేఖర్, సిరిపురపు సుదర్శన్రావు, పాటిబండ్ల యుగంధర్, నల్లమోతు రఘు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో విజేతల వివరా లను నిర్వాహకులు ప్రకటించా రు. బాలుర అండర్–13 సింగిల్స్లో బి.రేవంత్కుమార్, వి.అశ్వినిరాజ్, డబుల్స్లో బి.రేవంత్కుమార్ – అశ్వినిరాజ్, శశివర్ధన్ – సాహిత్, బాలికల అండర్–13 సింగిల్స్లో ఎం.చరితశ్రీ, జి.నిత్యసంతోషిని, డబుల్స్లో జి. నిత్య – ఎం.చరితశ్రీ, టి.నవియా, ఓంశ్రీల వరుసగా ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అలాగే, అండర్–15 బాలుర సింగిల్స్లో వి.మేఘవర్షిత్, ఎస్.స్వప్నిల్, డబుల్స్లో కె.విశ్వతేజ – స్వప్నిల్, కె.నిశాంత్సాయి– బి.అభినవ్, అండర్–17 బాలుర సింగిల్స్లో ఏ.వినయ్, తేజస్ వివేక్, డబుల్స్లో ఏ.వినయ్ – డి.తేజస్ వివేక్, విశ్వతేజ్ – ఎస్.నిఖిల్, బాలికల సింగిల్స్లో హర్షిత, బి.ధరణి, బాలికల అండర్–15 సింగిల్స్లో వై.హోషిత, జె.అన్విత, బాలుర అండర్–19 సింగిల్స్లో డి.తేజస్ వివేక్, ఏ.వినయ్, డబుల్స్లో యశ్వంత్ – ప్రర్థవిన్, ఎం.రాజీవ్ – ఎస్.నిఖిల్, బాలికల సింగిల్స్లో వి.వేదస్వి, హర్షిత మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నారు.
సంస్కృత పండితుడికి సన్మానం
భద్రాచలంటౌన్: భద్రాచల దేవస్థానంలో సంస్కృత పండితుడిగా పనిచేస్తున్న ఎస్టీజీ శ్రీమన్నారాయణ ఆచార్యులును భద్రాద్రి దేవస్థానం, ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో శనివారం ఘనంగా సన్మానించారు. వేలాది మంది విద్యార్థులకు సంస్కృత భాషను బోధించిన ఆయన ఇటీవల ప్రాచ్య విద్య విభూషణం బిరుదు అందుకున్నారు. ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఎల్. రమాదేవి, ఏఈఓలు శ్రవణ్ కుమార్, భవాని రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మానసిక వైద్యుల సదస్సులో మాజీ మంత్రి పువ్వాడ