మైసూరు: ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీ హామీల వల్ల కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల ఆర్థిక స్థితి పూర్తిగా క్షీణించిందని కేంద్ర మంత్రి హెచ్.డీ. కుమారస్వామి ఆరోపించారు. శుక్రవారం మైసూరు జిల్లాలోని కె.ఆర్.నగర తాలూకాలోని బసవనపుర, గెరడ, కెంచనహళ్లి గ్రామాల్లో మేలనకట్టె గణపతి ఆలయ ప్రారంభోత్సవం, హొస అగ్రహార గ్రామంలోని బసవేశ్వర స్వామి ఆలయ గోపురం ప్రారంభోత్సవం, బసవేశ్వర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే రూ.7.26 లక్షల కోట్ల రుణం తీసుకుందన్నారు. దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కనీసం లక్ష రూపాయల రుణభారం మోయాల్సి వచ్చిందని ఆయన వాపోయారు.
ఉద్యోగులకు జీతాలిచ్చే శక్తి కూడా లేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన బెయిలౌట్ పథకాల వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించే శక్తిని కూడా ప్రభుత్వం కోల్పోయింది. అదేవిధంగా హామీల ఆశతో హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా దివాలా తీయించింది. జీతాలు చెల్లించడానికి డబ్బు లేకపోయినా అధికారుల జీతాలను తగ్గిస్తోంది. రాష్ట్ర అధికార యంత్రాంగానికి అధిపతి అయిన ప్రధాన కార్యదర్శి జీతం కూడా తగ్గించారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో సృష్టించిన పరిస్థితే కర్ణాటకకు కూడా వస్తుందని ఆయన హెచ్చరించారు. కొన్నేళ్ల క్రితం శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి కర్ణాటకకు కూడా వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఏ వేదిక ౖపైనెనా చర్చకు సిద్ధం
తాను ఈ విషయం ఎక్కడైనా చెబుతాను. ఏ వేదికౖపైనెనా చర్చకు సిద్ధంగా ఉన్నాను. వారికి దమ్ముంటే చర్చకు రావాలని ఆయన సవాలు విసిరారు. ఎమ్మెల్సీ సీ.ఎన్. మంజేగౌడ, కె. వివేకానంద, మాజీ మంత్రి సా.రా.మహేష్, జేడీఎస్ జిల్లా యూనిట్ అధ్యక్షుడు ఎం.అశ్విన్ కుమార్, నాయకుడు మహాదేవ్ తదితరులు హాజరయ్యారు.
కేంద్ర మంత్రి హెచ్.డీ.కుమారస్వామి


