ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ | - | Sakshi
Sakshi News home page

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

Aug 3 2025 8:10 PM | Updated on Aug 3 2025 8:10 PM

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

హొసపేటె: నగరంలోని పలు ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై అధికారుల బృందం ఆకస్మికంగా దాడులు నిర్వహించి, ఎరువుల నిల్వలను భౌతికంగా తనిఖీ చేసింది. యూరియా కొరతను సద్వినియోగం చేసుకున్న కొంత మంది ఎరువులు, పురుగుమందుల దుకాణదారులు బ్లాక్‌ మార్కెట్లో ఎరువులు విక్రయిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారుల బృందం నగరంలోని కొన్ని దుకాణాలను ఆకస్మికంగా సందర్శించింది. నోడల్‌ అధికారి కృష్ణ ఉక్కుంద, వ్యవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఈ బృందానికి నాయకత్వం వహించారు. తహసీల్దార్‌ రవి అంగడి బృందానికి నాయకత్వం వహించగా టీపీ ఈఓ రామరెడ్డి పాటిల్‌, వ్యవసాయ శాఖ ఏడీ సంతోష్‌ పట్టదకల్‌ పాల్గొన్నారు. నగరంలోని కొన్ని దుకాణాలపై అధికారులు దాడులు చేసి, బోర్డులోని యూరియా, ఇతర ఎరువులు, విత్తనాల నిల్వలను తనిఖీ చేశారు. వారు స్టాక్‌ పుస్తకం, పంపిణీ పుస్తకాన్ని పరిశీలించారు. స్టాక్‌, భౌతిక స్టాక్‌ వివరాలను పీఓఎస్‌ యంత్రంలో నమోదు చేయాలని వారు ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు యూరియా ఎరువులు అందించాలని, ఏవైనా లోపాలు కనిపిస్తే కఠిన చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోను రైతులకు అధిక ధరకు ఎరువులు అమ్మకూడదు. అమ్మిన ప్రతి ఎరువుల బస్తాకు అధికారిక రసీదు ఇవ్వాలని, ఏదైనా ఫిర్యాదు వస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement