
మోదీ పాలన ప్రతి ఒక్కరికీ తెలియాలి
సాక్షి,బళ్లారి: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్ధవంతమైన, అభివృద్ధి, సంక్షేమ పాలన అందించారని, దేశ భద్రత, రక్షణ, ఉగ్రవాద నిర్మూలన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ముందుగా గుజరాత్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గుజరాత్ విమాన ప్రమాదం తమను ఎంతో కలిచివేసిందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పేదల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కేంద్ర పథకాలతో రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయన్నారు. పార్టీలకతీతంగా దేశాభివృద్ధి కోసం మోదీ చేస్తున్న కృషిని పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వై.ఎం.సతీష్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్ కుమార్ మోకా, కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి, బీజేపీ నాయకుడు రామలింగప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇంటింటికీ సమర్ధ పాలనను తీసుకెళ్లండి
పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి సూచన

మోదీ పాలన ప్రతి ఒక్కరికీ తెలియాలి