
మలెనాడులో జోరుగా వానలు
యశవంతపుర: చిక్కమగళూరు మలెనాడు ప్రాంతంలో వానలు జోరుగా కురుస్తున్నాయి. శృంగేరి సమీపంలోని నెమ్మార్ వద్ద జాతీయ రహదారిపై మట్టి చరియలు విరిగి పడ్డాయి. కళస, కుదురేముఖ్, కొప్ప, శృంగేరి, బాళెహెన్నూరు, కొట్టిగెహర, అల్దూరు, ఎన్ఆర్పుర, ముళ్లయ్యనగరి, కెమ్మణ్ణగుండి ప్రాంతాలలో మూడు రోజుల నుంచి భారీగా వానలు పడుతున్నాయి. ఆదివారం ఉదయం చిక్కమగళూరు పట్టణంలో ఓ మోస్తారు వాన కురుసింది. శృంగేరి సమీపంలోని సుంకద మక్కి–నెమ్మారు సమీపంలో విపరీతమైన వానలతో హైవేపై మట్టి చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఎస్కే బార్డర్, కార్కళ మార్గంలో రాకపోకలను అంతరాయం ఏర్పడింది. హైవే ప్రాధికారం. అగ్నిమాపక, పోలీసులు సిబ్బంది మట్టి చరియలను తోలగించే పనులు చేపట్టారు.
కారు పల్టీ
భారీ గాలి, వానలతో దత్తపీఠ మార్గం చంద్రద్రోణ పర్వతం కవికల్ గండి వద్ద రోడ్డు మలుపులో కారు పల్టీ కొట్టింది. ఎదురుగా వస్తున్న కారుకు సైడ్ ఇవ్వబోయి కారు రాతిపై ఎక్కి పల్టీ కొట్టింది. దీంతో ముళ్లయ్యనగరి మార్గంలో గంటల కొద్ది ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. కారులో ఐదు మంది స్వల్ప గాయాలతో బయట పడ్డారు. చిక్కమగళూరు గ్రామాంతర పోలీసులు ఘటన స్థలంను పరిశీలించారు. మలుపుల వద్ద వాహనాలని నెమ్మదిగా నడపాలని పోలీసులు పర్యటకులకు సూచించారు.
రెండు కార్లు ఢీ
శృంగేరి తాలూకా నెమ్మారు గ్రామం వద్ద భారీగా మట్టి చరియలు విరిగి పడ్డాయి. శృంగేరి–మంగళూరు మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా బంద్ చేశారు. పోలీసులు, గ్రామస్తులు కలిసి కూలిన మట్టిని తోలగిస్తున్నారు.
కూలిన ఇంటిగోడ
దక్షిణకన్నడ జిల్లా వ్యాప్తంగా భారీ వానలు కురుస్తున్నాయి. మంగళూరు పట్టణంలో కంకనాడిలోని ప్రైవేట్ ఆస్పత్రి గోడ కూలింది. ఆ ఇంటి పక్కన కాలినడకన వెళ్తున్న వారు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.
విరిగి పడుతున్న కొండచరియలు
రాకపోకలకు అంతరాయం

మలెనాడులో జోరుగా వానలు

మలెనాడులో జోరుగా వానలు