
బెణ్ణెహళ్ల, తుప్పరి హళ్ల వరద నివారణకు డీపీఆర్
హుబ్లీ: బెణ్ణెహళ్ల, తుప్పరి హళ్ల వాగుల వరద ముప్పును తప్పించేందుకు రూ.200 కోట్లతో పనులు చేసేందుకు రూ.16 కోట్లతో డీపీఆర్ సిద్ధం చేసినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్లాడ్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరదల్లో గల్లంతై మృతి చెందిన పాత హుబ్లీ నివాసి హుస్సేన్ సాబ్, కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి లాడ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రెండు వాగుల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వాగులకు డిసెట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించామన్నారు. అక్కడి నుంచి అనుమతి వచ్చాక పనులు ప్రారంభిస్తామన్నారు. నవళగుంద నియోజక వర్గంలో వరద బాధిత ప్రాంతాలలో పర్యాటించానన్నారు. బెణ్ణెహళ్ల, తుప్పరిహళ్ల వరద ప్రవాహం పెరిగిందని ప్రజలు తగినంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
బీఎంఎం ఉక్కు కర్మాగారం దాతృత్వం
హొసపేటె: బీఎంఎం ఉక్కు కర్మాగారం దాతృత్వం చాటింది. నగరంలోని 60 పడకల మాతా శిశు ఆస్పత్రికి సీఎస్ఆర్ నిధుల కింద రూ.4.5 కోట్లతో రెండు ఐసీయూ గదులు నిర్మింపజేసింది. అంబులెన్స్లు, రెండు వైకుంఠ రథ్ అంబులెన్స్లను విరాళంగా ఇచ్చింది. లాండ్రీ, విశ్రాంతి గదిని అందించింది. ఎంపీ తుకారాం, ఎమ్మెల్యే గవియప్ప, కంపెనీ జనరల్ మేనేజర్ గణేష్ హెగ్డే అంబులెన్స్, విశ్రాంతి గదిని ప్రారంభించారు.
రక్తదాన శిబిరం
హొసపేటె: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించింది. అనేక మంది సభ్యులు, సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సేవకులు ఈ శిబిరంలో ఎంతో ఉత్సాహంతో పాల్గొని రక్తదానం చేశారు. మరొకరి ప్రాణాలను కాపాడే గొప్ప లక్ష్యానికి మద్దతు ఇచ్చారు. బిల్లావాస్ ఖతార్ సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి పూజా వ్యాస రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. బిల్లావాస్ ఖతార్ అపర్ణ, శరత్తదితదితరులు పాల్గొన్నారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
రాయచూరు రూరల్ : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఎస్పీ పుట్టమాదయ్య అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ మైదానంలో ఆదివారం యోగా శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో రోజురోజుకు కొత్త రకం వ్యాధులు సంక్రమిస్తున్నాయన్నారు. ఈ పరిస్థితుల్లో యోగాను ఆచరిస్తే వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. రోజూ క్రమం తప్పకుండా యోగా చేయాలన్నారు. అదేవిధంగా పరిసరాలను పరిరక్షించేందుకు మొక్కలు నాటాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆయుష్ అధికారి శంకనర గౌడ, డాక్టర్.తిమ్మప్ప, పూజా, నవీన్ పాల్గొన్నారు.
విమాన ప్రమాద మృతులకు నివాళి
రాయచూరు రూరల్: అహ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ప్ర మాదంలో అసువులుబాసిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. శనివారం రాత్రి మస్కిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు నాగవేణి పాటిల్ ఆధ్వర్యంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు.
షూటింగ్లో అగ్ని ప్రమాదం
యశవంతపుర: బెంగళూరు నగరంలో జరుగుతున్న ఫినిక్స్ సినిమా షూటింగ్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. యాక్షన్ దృశ్యాలు చిత్రీకరిస్తుండగా నిప్పు రవ్వలు చెలరేగి నటుడు భాస్కర్శెట్టి కాలిపై పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. తాను క్షేమంగా ఉన్నట్లు నటుడు భాస్కర్శెట్టి తెలిపారు.

బెణ్ణెహళ్ల, తుప్పరి హళ్ల వరద నివారణకు డీపీఆర్

బెణ్ణెహళ్ల, తుప్పరి హళ్ల వరద నివారణకు డీపీఆర్

బెణ్ణెహళ్ల, తుప్పరి హళ్ల వరద నివారణకు డీపీఆర్