
క్రీడలతో మానసిక ఉల్లాసం
రాయచూరు రూరల్ : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పంచుతామని జిల్లా ఎస్పీ పుట్ట మాదయ్య పేర్కొన్నారు. జిల్లా పోలీస్ క్రీడా మైదానంలో రాష్ట్ర కార్య నిర్వాహక పాత్రికేయుల సంఘం, అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సౌహార్ధ క్రికెట్ టోర్నీని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. నిత్యం ఒత్తిడితో విధులు నిర్వహించే పాత్రికేయులు, అధికారులకు ఇలాంటి క్రీడలు ఎంతో మనశ్శాంతిని ఇస్తాయన్నారు. క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు గురునాథ్, కార్యదర్శి పాషా, శివమూర్తి శివప్ప, మల్లికార్జున, సిద్దు బిరదార్, బీమేష్ పాల్గొన్నారు.

క్రీడలతో మానసిక ఉల్లాసం