సద్గుణాలను అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

సద్గుణాలను అలవర్చుకోవాలి

Jun 16 2025 6:56 AM | Updated on Jun 16 2025 6:56 AM

సద్గు

సద్గుణాలను అలవర్చుకోవాలి

రాయచూరురూరల్‌: ప్రతి ఒక్కరూ సద్గుణాలను అలవర్చుకొని ఇతరులకు మర్గదర్శనం కావాలని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు అధ్యక్షుడు సయ్యద్‌ షా అలీ అల్‌ హుసేనీ పిలుపునిచ్చారు. శనివారం రాత్రి నగరంలోని వాల్కట్‌ మైదానంలో మైనార్టీ ముస్లింల నుంచి ఆయన సన్మానం స్వీకరించి మాట్లాడారు. అధర్మాలకు తావు ఇవ్వరాదన్నారు. సేవతోనే ఉత్తమ జీవితం గడపాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చుతానన్నారు. మంత్రి భోసురాజ్‌, ఎంపీ కుమారనాయక్‌, ఎమ్మెల్సీ వసంత్‌ కుమార్‌, భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌తో పాటు వివిధ ప్రాంతాల నుంచి మత గురువులు పాల్గొన్నారు.

చోరీ సొత్తు స్వాధీనం

హుబ్లీ: నగరంలోని వివిధ చోట్ల జరిగిన చోరీలను పోలీసుల ఛేదించారు. రూ.6 లక్షల విలువైన 8 బైక్‌లు, 20 గ్రాముల బంగారు చైన్‌, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ చిక్కమఠ సారథ్యంలో పాత హుబ్లీ సీఐ ఎంఎస్‌ సింధూర, బీఎన్‌ సతాన్న, పీఎస్‌ విశ్వనాథ ఆధ్వర్యంలో పోలీసులు ఈ కేసులను ఛేదించారు.

తల్వార్‌తో రీల్స్‌...

నలుగురి అరెస్ట్‌

హుబ్లీ: బహిరంగ స్థలాల్లో తల్వార్‌ పట్టుకొని రీల్స్‌ చేస్తున్న నలుగురు పట్టుబడ్డారు. గోపాల, హనుమంత, ఆరీఫ్‌, నియాకత్‌ అనేవారిని పాత హుబ్లీ పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. పాత హుబ్లీ కొత్త ఆనంద నగర సమీపంలోని మసీదు వద్ద ఇటీవల ఆ నలుగురు కత్తి పట్టుకొని రీల్స్‌ చేశారు. పోలీసులు స్పందించి భారత ఆయుధాల చట్టం పరిధిలో నిందితులను అరెస్ట్‌ చేశారు.

కారు, ఖాళీ సిలిండర్ల లారీ ఢీ

ఏడీసీకి తప్పిన ముప్పు

హుబ్లీ: ఏడీసీ కారు– ఖాళీ సిలిండర్ల లారీ ఢీకొన్న ఘటన తాలూకాలోని తాలూకాలోని హెబసూరు గ్రామం వద్ద ఆదివారం జరిగింది. వివరాలు... ప్రమాదం నుంచి ఏడీసీ తృటిలో బయట పడ్డారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంతోష్‌లాడ్‌ నవళగుంద హుబ్లీ తాలూకాల్లోని వరద బాధిత ప్రాంతాలు పర్యటిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల గురించి మంత్రికి వివరాలు అందజేయడానికి జిల్లా అదనపు జిల్లాధికారి గీత కారులో బయల్దేరారు. హెబసూరు వద్దకు రాగానే ఖాళీ సిలిండర్ల లారీ ఎదురైంది. పరస్పరం ఢీకొనగా రెండు వాహనాలు దెబ్బతిన్నాయి. ఏడీసీ ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు. గూడ్స్‌ వాహనంలో ఖాళీ సిలెండర్లు కావడంతో ప్రమాదం తప్పిందని హుబ్లీ గ్రామీణ పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.

ఇద్దరు దొంగల అరెస్ట్‌

రాయచూరు రూరల్‌: నగరంలోని కిరాణా దుకాణాల్లో చోరీకి పాల్పడుతున్న దొంగలు పట్టుబడ్డారు. నగరంలోని షియాతలాబ్‌కు చెందిన సోహెల్‌(22), జలాల్‌ నగర్‌ సద్దామ్‌(21)ను నేతాజీ నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులు నగరంలోని బసవన బావి సర్కిల్‌లో కిరాణ కొట్టులో రూ.30 వేల నగద దొంగలించారరని ఎస్‌ఐ లక్ష్మి తెలిపారు.

చక్కెర బస్తాల లారీ బోల్తా

హొసపేటె: లారీ బోల్తా పడి చక్కెర నేలపాలైంది. ఈఘటన విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని అమలాపూర్‌ గ్రామం వద్ద జరిగింది. జాతీయ రహదారి–50పై చక్కెర లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడింది. దీంతో మిగిలిన వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. కూడ్లిగి పోలీసులు, హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది వచ్చి క్రేన్‌ ద్వారా లారీని, బస్తాలను పక్కకు తొలగించారు. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు.

నకిలీ నోట్ల మార్పిడి

శివమొగ్గ: శివమొగ్గలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న కేసులో భద్రావతి న్యూ టౌన్‌ పోలీసులు ఒకరిని అరెస్ట్‌ చేశారు. భద్రావతిలోని బండరహళ్లి ఎదురుగా ఉన్న నాగమలే నివాసి అయిన రంగేగౌడ (57) నిందితుడు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పనిచేస్తున్నాడు. అతని నుంచి 13 నకిలీ రూ. 500 నోట్లు, రూ.200, రూ. 100, రూ. 50 నోట్లను సీజ్‌ చేశారు. నకిలీ నోట్లను మార్పిడి చేసినట్లు అంగీకరించాడు. విచారణలో భద్రావతి డీఎస్పీ నాగరాజ్‌, ఇన్‌స్పెక్టర్‌ మంజునాథ్‌ పాల్గొన్నారు.

సద్గుణాలను అలవర్చుకోవాలి1
1/3

సద్గుణాలను అలవర్చుకోవాలి

సద్గుణాలను అలవర్చుకోవాలి2
2/3

సద్గుణాలను అలవర్చుకోవాలి

సద్గుణాలను అలవర్చుకోవాలి3
3/3

సద్గుణాలను అలవర్చుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement