న్యూస్రీల్
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026
కరీంనగర్స్పోర్ట్స్: కరీంనగర్ బస్టాండ్లో ఆర్టీసీ బస్సులు ప్లాట్ఫాం వద్దకు రాకముందే ప్రయాణికులు డిపో వద్దకు పరుగు తీసి బస్సులు ఎక్కుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో ఒకేసారి బస్సు ఎక్కేందుకు పోటీ పడటంతో తోపులాట చోటుచేసుకుంటోంది. ప్రమాదాల అవకాశాలు పెరగడంతో పాటు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. డిపో వద్ద బస్సులు ఎక్కకుండా చర్యలు తీసుకుని, నిర్ణీత ప్లాట్ఫాం వద్ద బస్సులు ఆగేలా అధికారులు పర్యవేక్షణ చేపట్టాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.


