
ఏసీబీకి చిక్కిన జెడ్పీ అధికారులు
కరీంనగర్క్రైం: జిల్లా పరిషత్లో అద్దె వాహనాలకు బిల్లు చెల్లింపు విషయంలో లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు చిక్కారు. జిల్లా పరిషత్లో ఓ వ్యక్తి తన వాహనాన్ని అద్దెకు పెట్టాడు. 10నెలలు బిల్లు ఇవ్వాల్సి ఉండగా కొన్ని రోజుల క్రితం 4నెలల బిల్లు చెల్లించారు. మిగితా 6 నెలల బిల్లు ఇవ్వాలంటే రూ.8వేల లంచం ఇవ్వాలని పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్లో డబ్బులు తీసుకుంటుండగా ఇంజినీర్ శరత్, సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ను ఏసీబీ డీఎస్పీ విజయ్కుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.