దోమకొండ: దోమకొండ చేనేత సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి బుధవారం 10 మంది నామినేషన్లు వేసినట్లు ఎన్నికల అధికారి భూమయ్య తెలిపారు. ఐరేని నర్సయ్య, బత్తిని సిద్ధరాములు, సుంచు రాములు, అందె నాగభూషణం, బీసు సంతోష్కుమార్, బాలే సురేందర్, కూచని జగదీష్, బొమ్మెర జమున, కోట సదానంద, కై రంకొండ శ్రీనివాస్లు నామినేషన్లు వేసినట్లు ఆయన తెలిపారు. గురువారం విత్డ్రాలకు అవకాశం.. ఈనెల 24న ఎన్నికలు ఉంటాయని ఆయన వివరించారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాక నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొమ్మెర గంగాధర్, క్యాషియర్ అందే గణేష్, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


