తెయూ(డిచ్పల్లి):తెలంగాణ విశ్వవిద్యాలయం పార్ట్టైం లెక్చరర్ డాక్టర్ ఆర్ సాయిలక్ష్మి రచించిన ‘నిజామాబాద్ జిల్లా సీ్త్రల సాహిత్యం–ఒక పరిశీలన’ (పీహెచ్డీ గ్రంథం) పుస్తకాన్ని మంగళవారం ఆవిష్కరించారు. తెయూ ఆర్ట్స్ కళాశాల మినీ సెమినార్ హాల్లో ఈ పుస్తకాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాసిం చేతుల మీదుగా ఆవిష్కరించారు. తెలుగుశాఖ అధ్యక్షులు, బీవోఎస్ చైర్మన్ కనకయ్య, లావణ్య, వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణచక్రవర్తి, పీఆర్వో రమణచారి, పున్నయ్య, ఆర్ట్స్ డీన్ మహమ్మద్ మూసా ఖురేషీ, పుప్పాల రవీందర్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


