
కష్టపడి.. కొడుకులను ప్రయోజకులను చేసి..
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కోటాయి చిన్న సిద్దయ్యకు ముగ్గురు కుమారులు. వారిని ఉన్నతంగా చదివించి ఉజ్వల భవిష్యత్కు అండగా నిలిచి తండ్రిగా విజయం సాధించాడు. గ్రామంలో తనకున్న ఎకరంన్నర భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. పిల్లల ఉన్నత చదువు కోసం భార్య లక్ష్మితో కలిసి 20 ఏళ్ల క్రితం కామారెడ్డి పట్టణానికి వచ్చాడు. సిద్దయ్యకు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పట్టణంలోని ఓ ఆయిల్ మిల్లో పనిలో చేరాడు. అలా రెండు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారులను ఉన్నతంగా చదివించాడు. ప్రస్తుతం పెద్ద కుమారుడు ఆంజనేయులు జిల్లాలోని ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు రాజు కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక మూడో కుమారుడు డాక్టర్ రమేష్ చిన్న పిల్లల వైద్య నిపుణుడిగా కామారెడ్డిలో కొనసాగుతున్నాడు. కుమారులు మంచిగా స్థిరపడంతో కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని సంతోషంగా ఉన్నానని సాక్షితో సిద్దయ్య చెప్పాడు.

కష్టపడి.. కొడుకులను ప్రయోజకులను చేసి..