
విరబూసిన బ్రహ్మ కమలం
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామ బీజేపీ నాయకుడు రాజిరెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలం విరబూసింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బ్రహ్మకమలాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే పూలు వికసించి కొన్ని గంటల వ్యవధిలోనే ముడుచుకుంటాయని రాజిరెడ్డి అన్నారు. పూలను శివాలయంలో సమర్పించారు.
గుంతల పూడ్చివేత
మాచారెడ్డి: మండల కేంద్రంలోని కామారెడ్డి, సిరిసిల్ల రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గుంతలతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో గ్రామ యువకులు ముందుకువచ్చి శనివారం రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చివేశారు.

విరబూసిన బ్రహ్మ కమలం