వ్యవసాయం చేస్తూనే.. | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయం చేస్తూనే..

Jun 15 2025 7:40 AM | Updated on Jun 15 2025 7:40 AM

వ్యవస

వ్యవసాయం చేస్తూనే..

నస్రుల్లాబాద్‌: మండలంలోని సంగం గ్రామానికి చెందిన సంగ్యా నాయక్‌ వ్యవసాయం చేస్తూనే, తన ముగ్గురు పిల్లలను ఉన్నతంగా చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు కల్యాణ్‌ ఐఐటీ మూడో సంవత్సరం చదువుతుండగా, రెండో కొడుకు చంద్రశేఖర్‌ ఐఐటీలో సీటు సాధించారు. కూతరు పద్మావతి బీఎస్సీ నర్సింగ్‌ చదువుతోంది. ఓ సాధారణ రైతు తమ పిల్లలను ఉన్నతంగా చదివిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.

అమ్మాయి అమెరికాలో ఎంఎస్‌....

సాధారణంగా అమ్మాయికి వయస్సు రాగానే పెళ్లి చేయాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. కానీ సంగం గ్రామానికి చెందిన విఠల్‌ తన కూతురు మాత్రం విదేశాల్లో చదవాలని కోరుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఆయన కూతురు పాల్త్య పద్మావతి హైదరాబాద్‌లో బీడీఎస్‌ చేసింది. తండ్రి ఆశయ సాధనకు అమెరికాలో ఎంఎస్‌ చేస్తుంది. ఓ తండాలో వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న విఠల్‌ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

వ్యవసాయం చేస్తూనే..  1
1/1

వ్యవసాయం చేస్తూనే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement