క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Jun 15 2025 7:40 AM | Updated on Jun 15 2025 7:40 AM

క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నిజామాబాద్‌నాగారం : నిజామాబాద్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–19 క్రికెట్‌ లీగ్‌ టోర్నమెంట్‌ను శనివారం అర్సపల్లిలో శైలేజా మైదానంలో ప్రారంభమయ్యాయి. కోచ్‌ నయూమ్‌, ఫారస్‌లు టాస్‌ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు. మొదటి మ్యాచులో గ్రీన్‌ వర్సెస్‌ ఏల్లో మధ్య జరిగింది. టాస్‌ గెలిచి గ్రీన్‌జట్టు బ్యాటింగ్‌ చేయగా 10 వికెట్లకు గాను 255 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఏల్లో జట్టు 150 పరుగులకే అలౌట్‌కావడంతో గ్రీన్‌ జట్టు గెలిచింది. రెండో మ్యాచ్‌లో బ్లాక్‌ వర్సెస్‌ బ్లూ బ్లాక్‌ మధ్య పోటీ జరిగింది. ఇందులో టాస్‌ గెలిచిన బ్లూ బ్లాక్‌జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బ్లాక్‌ జట్టు నిర్ణీత ఓవర్లలో 105 పరుగులు చేసి అలౌట్‌కావడంతో బ్లూ బ్లాక్‌జట్టు గెలిచింది.

ఆలయాల పరిరక్షణ మన బాధ్యత

నిజామాబాద్‌ రూరల్‌: ఆలయాలను పరిరక్షించుకోడం మన బాధ్యత అని జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. శనివారం నగరంలోని కబ్జాకు గురువుతున్న బోధన్‌ రోడ్‌లోని ఆటోనగర్‌ హనుమాన్‌ మందిరాన్ని రక్షించటానికి సహకరించాలని శ్రీ హనుమాన్‌ మందిర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఇందల్వాయి కిషన్‌ గంట్యాల వెంకటేశ్‌, అంబదాస్‌ రావు, మల్లేశ్‌ గౌడ్‌, దోర్నాల రవి, శాతాల లింబాద్రి, మధు తదితరులు అర్బన్‌ బీజేపీ క్యాంపు ఆఫీసులో అర్వింద్‌ కు వినతి పత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement