
ధాన్యం బకాయి సొమ్ము
చెల్లించాలని వినతి
అమలాపురం రూరల్: గత మే నెలలో రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులు విక్రయించిన ధాన్యానికి బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరుతూ కోనసీమ రైతు పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ మహేష్ కుమార్ కు వినతిపత్రం అందించారు. సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల బ్రహ్మానందం, అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు, మంగెన నరసింహారావు, ఎరుబండి లక్ష్మయ్య, అప్పారి చినవెంకటరమణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ తదితరులు వినతిపత్రం అందించారు. వారు మాట్లాడుతూ 45 రోజులుగా ధాన్యం సొమ్ము రాలేదని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సూమారు రూ.250 కోట్లకుఽపైగా ధాన్యం బకాయిలు ఇవ్వాలని వారు తెలిపారు.