‘సార్‌... ఇలా చేశారు’ | - | Sakshi
Sakshi News home page

‘సార్‌... ఇలా చేశారు’

Jun 17 2025 5:00 AM | Updated on Jun 17 2025 5:00 AM

‘సార్‌...  ఇలా చేశారు’

‘సార్‌... ఇలా చేశారు’

నర్సింగ్‌ బదిలీలలో మాయాజాలంపై ఆర్‌డీ కలెక్టర్‌కు వివరణ

కాకినాడ క్రైం: నర్సింగ్‌ బదిలీలలో నర్సింగ్‌ అసోసియేషన్‌ అగ్రనాయకత్వ మాయాజాలంపై కలెక్టర్‌ షణ్మోహన్‌ సీరియస్‌ అయ్యారు. బదిలీల ప్రయోజనాలను పొందేందుకు అసోసియేషన్‌ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికై న వారి పేర్లకి బదులు ఇతరులవి చేర్చడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆర్‌డీ డాక్టర్‌ పద్మశశిధర్‌ని ఆరా తీశారు. ఈ ఉదంతంపై పూర్తి వివరాలివ్వాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో వివాదానికి సంబంధించి ఆది నుంచీ చోటు చేసుకున్న ప్రతి అంశాన్ని ఆర్‌డీ వివరణాత్మకంగా కలెక్టర్‌కు అందించారు. ఉన్నతాధికారులనే బురిడీ కొట్టించిన ఈ వ్యవహారంపై కలెక్టర్‌ అప్రమత్తమయ్యారు. తమకందుతున్న వివిధ యూనియన్ల లెటర్లలోని ఆఫీస్‌ బేరర్ల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, నిర్ధారించుకోవాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. కాగా కలెక్టర్‌ సూచనల మేరకు బాధ్యులపై చర్యలు చేపడతామని డాక్టర్‌ పద్మశశిధర్‌ అన్నారు.

పాత కక్షల నేపథ్యంలో ఇరు వర్గాల ఘర్షణ

ఆలమూరు: మండల కేంద్రమైన ఆలమూరులో ఇరు వర్గాల మధ్య పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ జరిగింది. స్థానిక ఎస్సై ఎం.అశోక్‌ కథనం ప్రకారం స్థానిక పెద్ద కాలువ రోడ్డులోని ఎర్రకాలనీ వద్ద పలివెల తేజ, కొమ్ము రోహిత్‌ వర్గాల మధ్య ఆదివారం రాత్రి పరస్పర దాడులు జరిగాయి. ఈ దాడుల్లో హత్యా ప్రయత్నం జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇరు వర్గాలకు చెందిన 14 మందిపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

బిక్కవోలు: మండలంలోని పందలపాక గ్రామంలోని రేకుల షెడ్డులో మేడిశెట్టి వెంకటరమణ (44) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని ఎస్‌ఐ వాసంశెట్టి రవిచంద్ర కుమార్‌ సోమవారం తెలిపారు. ఊలపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి వెంకటరమణ పందలపాక కోదండ రామ రైస్‌మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మద్యం తాగడానికి ఇంట్లో రూ.100 అడిగాడు. ఇవ్వకపోవడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తాను పనిచేసే రైస్‌మిల్లు ఎదురుగా ఉన్న షెడ్డులోకి వెళ్లి ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రుమాలుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఆయన కుమారుడు అజిత్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని అనపర్తి సీహెచ్‌సీకి తరలించి, పంచానామా అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement