గత మే 26న జలాశయం మట్టి నమూనా సేకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇందుకోసం జలాశయంలో మొత్తం ఎనిమిది చోట్ల బోరుడ్రిల్లింగ్ చేయించి, మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల సేకరించిన మట్టి నమూనాలను హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ల్యాబ్కు పంపారు. మిగిలిన నాలుగు చోట్ల సేకరించే మట్టిని కూడా టీఎస్ఈఆర్ఎల్కు పంపనున్నారు. అక్కడి నుంచి వచ్చే నివేదిక, మట్టి నమూనాలను పుణెలోని సీడబ్ల్యూపీఆర్ఎస్కు పంపించి.. ఆనకట్టలోని రాక్టోల్, తూముల అడుగు భాగంలో ఎలాంటి మట్టి ఎన్ని లేయర్లతో నిర్మాణం చేపట్టాలనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఫలితాల అనంతరం వచ్చే తుది నివేదిక ఆధారంగా రిజర్వాయర్కు మరమ్మతు చేపట్టనున్నారు.


