జోగుళాంబ సన్నిధిలో డిప్యూటీ సీఎం సతీమణి | - | Sakshi
Sakshi News home page

జోగుళాంబ సన్నిధిలో డిప్యూటీ సీఎం సతీమణి

Jun 18 2025 3:43 AM | Updated on Jun 18 2025 3:43 AM

జోగుళ

జోగుళాంబ సన్నిధిలో డిప్యూటీ సీఎం సతీమణి

అలంపూర్‌: దక్షిణ కాశీ అలంపూర్‌ క్షేత్ర ఆలయాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి తీర్ధ ప్రసాదాలు అందజేసి అశీర్వచనం పలికారు.

అంధ విద్యార్థులకు ప్రవేశాలు

గద్వాల: 2025–26 సంవత్సరానికి గాను రాష్ట్ర వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్‌ జెండర్స్‌ వ్యక్తుల సాధికారిక శాఖ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నడపబడుతున్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, కళాశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు అంథులైన విద్యార్థినీ విద్యార్థుల ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అంధుల ఆశ్రమ పాఠశాల కళాశాల ప్రిన్సిపల్‌ రాములు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలలో చదువుకునే అంధులైన విద్యార్థినీ విద్యార్ధులకు ఉచిత భోజనం, 4 జతల దుస్తులు ప్రభుత్వం అందజేస్తుందని, అవసరమైన ఇతర అన్ని వసతులు ఉచితంగా కల్పిస్తామని తెలిపారు. అడ్మిషన్లకుగాను మహబూబ్‌నగర్‌ పిల్లలమర్రి రోడ్డులోని అంధుల ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపల్‌ సెల్‌ నం.9618243794 ద్వారా సంప్రదించాలని కోరారు.

పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

గద్వాల: గ్రామీణ ప్రాంతాల స్వయం సహయక బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని.. ఆ ఉద్దేశ్యంతోనే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కరోజు ర్యాంపు అవగాహన సదస్సును నిర్వహించినట్లు జిల్లా ఇండస్ట్రీస్‌ సెంటర్‌ జనరల్‌ మేనేజర్‌ రామలింగేశ్వర్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం మహిళా సమాఖ్య కార్యాలయంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ మరియు పేదరిక నిర్మూలన సంస్థతో కలిసి అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. మహిళలకు 15 రోజల పాటు పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్‌పై నైపుణ్యభివృద్ధి, ఆచరణీయ పరిశ్రమ రిజిస్ట్రేషన్‌, బ్యాంకుల ద్వారా రుణ సహాయం ఇప్పించడం జరుగుతుందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

గద్వాలటౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని, ఉపాధ్యాయులపై నమ్మకం ఉంచి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆర్‌జేడీ విజయలక్ష్మి సూచించారు. స్థానిక పీజేపీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులలోని విద్యార్థులతో మాట్లాడారు. ప్రతి విద్యార్థికి రాయడం, చదవడం తప్పనిసరిగా రావాలని సూచించారు. అనంతరం బడిబాట కార్యక్రమంలో పాల్గొని విద్యార్థుల చేత సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లాలోని విద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గతేడాది పదో తరగతి ఫలితాలల్లో జిల్లా మెరుగైన ఫలితాలు సాధించిందని, ఆదే స్ఫూర్తితో మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. బడీడు పిల్లందరూ ప్రభుత్వ పాఠశాలలోనే ఉండాలన్నారు. ప్రైవేటు కంటే ప్రభుత్వ బడుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత సాఽధిస్తున్నామనే విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి, పిల్లల తల్లిదండ్రులను బాగస్వామ్యం చేయాలన్నారు. ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలు, బడిబాట కార్యక్రమాలు, విద్యార్థుల హజరును ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌గౌడ్‌, సెక్టోరియల్‌ అధికారులు హంపయ్య, ఎస్తేర్‌రాణి, శాంతిరాజు తదితరులు పాల్గొన్నారు.

జోగుళాంబ సన్నిధిలో డిప్యూటీ సీఎం సతీమణి  
1
1/1

జోగుళాంబ సన్నిధిలో డిప్యూటీ సీఎం సతీమణి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement