
సదరం సర్టిఫికెట్ల జారీ వేగవంతం చేయాలి
గద్వాల: జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రజకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంతోష్ వైద్య శాఖ అధికారులకు ఆదేశించారు. మంగళవారం ఐడీఓసీ కాన్పరెన్స్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో చేపట్టిన సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ స్లట్ బుకింగ్ విధానం పెండింగ్ దరఖాస్తుల వివరాలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో విభాగాల వారీగా చేపట్టిన పనులపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎంత మంది స్లాట్లు బుక్ చేస్తున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారి దరఖాస్తులను ఎంత మేరకు క్లియర్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆర్థోపెడిక్ విభాగంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. వచ్చిన దరఖాస్తుల వివరాలను డిజిటల్గా నమోదు చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ ఇందిరా, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.