బీఎంఎస్‌ రాజీలేని పోరాటం | - | Sakshi
Sakshi News home page

బీఎంఎస్‌ రాజీలేని పోరాటం

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

భూపాలపల్లి అర్బన్‌: సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణ, బొగ్గు పరిశ్రమల రక్షణ కోసం బీఎంఎస్‌ రాజీలేని పోరాటాలు చేస్తోందని బీఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌ అన్నారు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే–8వ గనిలో శుక్రవారం నూతనంగా సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై న సందర్భంగా ‘బీఎంఎస్‌ కార్మిక భరోసా’ పేరుతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. సింగరేణి అభివృద్ధి విషయంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు, కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేటీకే–8వ గని ఫిట్‌ కార్యదర్శి అడపా రాజు, బీఎంఎస్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు వెలబోయిన సుజేందర్‌, నాయకులు మల్లేష్‌ శంకర్‌, నారాయణ, శీలం రాజు, మల్లేష్‌, శ్రవణ్‌, కనకయ్య, ప్రవీణ్‌, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement