కాళేశ్వరం: సైబర్ నేరాలపట్ల ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన గ్రామస్తుల కమ్యూనిటీ సీసీటీవీ ప్రోగ్రాంలో భాగంగా 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రారంభించారు. అనంతరం అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దన్నారు. యువత బండి నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హెల్మెట్ తప్పక ధరించాలని చెప్పారు. అతివేగం ప్రమాదకరమన్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంగిస్తే భారీ జరిమానాలు తప్పవని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చీర్ల చంద్రశేఖర్రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు పవన్కుమార్, సాయిశశాంక్ పాల్గొన్నారు.


