లండన్‌లో ఉన్న కూతురును రప్పించి తండ్రి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

‘నేను చనిపోతున్నాను.. ఇంటికి రా తల్లీ’

Aug 30 2023 11:12 AM | Updated on Aug 30 2023 11:33 AM

- - Sakshi

వరంగల్: ‘నేను చనిపోతున్నాను.. ఇంటికి రా తల్లీ’ అంటూ లండన్‌లో ఉన్న కూతురుకు ఫోన్‌ చేసిన తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధి కుర్చపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మినుకూరి భగవాన్‌రెడ్డి(53)–మంగా దేవి దంపతులకు కూతురు సౌమ్యిక, కుమారుడు ఉన్నారు. కుమారుడు ఇంటర్‌ చదువుతుండగా.. కూతురును ఉన్నత విద్యాభ్యాసం కోసం గత ఏడా ది లండన్‌కు పంపించేందుకు భగవాన్‌రెడ్డి అప్పులు చేశాడు. కొన్నాళ్లుగా భార్య ఆరోగ్యం బాగోలేక చికి త్స చేయించడానికి మరిన్ని అప్పులు చేయాల్సి వచ్చింది.

అవి ఎలా తీర్చాలనే బెంగతో మదనపడుతూ ఉన్న భగవాన్‌రెడ్డి.. రెండు రోజులుగా కూతురుకు ఫోన్‌ చేసి ‘నేను చనిపోతున్నాను.. ఇంటికి రా తల్లీ’ అంటూ ఫోన్‌ చేశాడు. సౌమ్యిక వెంటనే ఇండియాకు బయలుదేరి మంగళవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. హైదరాబాద్‌ వచ్చా నాన్న అంటూ ఫోన్‌ చేసి మాట్లాడింది. ఇంతలో భగవాన్‌రెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పురుగుల మందు తాగాడు.

ఆ తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటికి చేరుకున్న కూతురు.. ఎంత పని చేశావు నాన్నా.. నన్ను ఇక్కడి రమ్మని కనిపించని లోకాని వెళ్లావా.. అంటూ తండ్రి మృతదేహంపై పడి రోదించడంతో అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. మృతుడి తండ్రి రాజిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement