● రూ.40 లక్షల ఆస్తి నష్టం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్కులో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పార్కులోని శ్రీసిరి టెక్స్టైల్స్శ్రీ పరిశ్రమలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యజమాని వాసం రేఖకు చెందిన 7 ర్యాపియర్ లూమ్స్(మరమగ్గాలు)తోపాటు సుమారు రూ.40 లక్షల విలువైన వస్త్రం కాలి బూడిదైంది. మంటలకు షెడ్ కూడా దెబ్బతింది. ఫైర్స్టేషన్ అధికారులు, తంగళ్లపల్లి పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


