ఎన్నికై న అధ్యక్ష, కార్యదర్శులు
జగిత్యాలరూరల్: జగిత్యాల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎర్ర నర్సయ్య ఎన్నికయ్యారు. కోర్టు ఆవరణలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నర్సయ్య, ఉపాధ్యక్షుడిగా మర్రిపెల్లి సత్యప్రకాష్, కోశాధికారిగా జున్ను రాజేందర్, ప్రధాన కార్యదర్శిగా అందె మారుతి, సంయుక్త కార్యదర్శిగా బెజ్జారపు ప్రవీణ్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా బోగ ఓంప్రకాశ్, తుమ్మనపల్లి రమేష్, న్యాయవాదులు రామిడి జగన్, ఇనుగుర్తి శివాణి, గట్టుపల్లి సురేష్ పాల్గొన్నారు.


